మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘సైరా’ మూవీ షూటింగ్ ప్రస్తుతం జార్జియాలో జరుగుతున్న విషయం తెలిసిందే. దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీకి సంబంధించి ఒక కీలకమైన యుద్ధ సన్నివేశం చిత్రీకరణ ఇప్పుడు జార్జియాలో జరుగుతోంది. ‘సైరా’ మూవీకి సంబంధించి ఇంటర్వెల్ ముందు వచ్చే ఈయుద్ధం సీన్ సుమారు 15 నిమిషాలు ఉంటుందని సమాచారం. అయితే ఈ సీన్ చిత్రీకరణ కోసం 45 కోట్లు ఖర్చు చేయడం షాకింగ్ న్యూస్ గా మారింది. 
 à°’క్క సీన్ కోసం 45 కోట్లు
అత్యంత భారీస్థాయిలో చిత్రీకరింప బడుతున్న ఈపోరాట సన్నివేశం ఈసినిమాలో చూసే ప్రేక్షకులు ధియేటర్ లోని తమ సీటు అంచుమీద కూర్చుని వీక్షించేలా ఉద్వేగభరితంగా ఉంటుందని సమాచారం. ఈ స్కీన్ కోసం  హాలీవుడ్ ఫైట్ మాస్టర్స్ దర్శకుడు సురేందర్ రెడ్డి సూచనలతో డిజైన్ చేశారని తెలుస్తోంది. ఈ చిత్రంలో నయనతారతో పాటు తమన్నా ప్రగ్య జైస్వాల్ వంటి వారు కూడా చిరంజీవి పక్కన నటిస్తూ ఈమూవీకి గ్లామర్ షోని తెచ్చి పెడుతున్నారు. 
 హాలీవుడ్ ఫైట్ మాస్టర్స్
ఎట్టి పరిస్థితుల్లో ఈ చిత్రాన్ని 2019 వేసవిలో విడుదల చేయాలనన్న టార్గెట్ తో పనిచేస్తున్న ఈమూవీ యూనిట్ కు ప్రస్తుతం జార్జియా దేశంలో వాతావరణం అనుకూలించకపోయినా ఆవ్యతిరేక వాతావరణ పరిస్తుతులను ఎదిరించి షూటింగ్ చేస్తున్నట్లు టాక్. జార్జియా షూటింగ్ ముగించుకుని ఈ యూనిట్ ఈనెలా ఖరుకు తిరిగి వచ్చిన తరువాత ఈ సినిమాకు సంబంధించి సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాసిన ఒక ఉద్వేగ భరితమైన పాటను హైదరాబాద్ లో ఒక ప్రత్యేకమైన సెట్ వేసి తీయబోతున్నట్లు తెలుస్తోంది. 
 అందాల తారలంతా
ఇది ఇలా ఉండగా ఈమూవీకి సంబంధించి భారీ ఆఫర్స్ బయ్యర్ల నుండి వస్తున్నా ఈమూవీ షూటింగ్ అంతా పూర్తి అయ్యాక మాత్రమే పరిశీలిస్తానని నిర్మాత రామ్ చరణ్ చెపుతున్నట్లు టాక్. దీనితో ‘సైరా’ మూవీకి మరింత క్రేజ్ పెరిగిన తరువాత ఈ మూవీని అత్యంత భారీ రేట్లకు అమ్మెలా చరణ్ వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం..



మరింత సమాచారం తెలుసుకోండి: