తెలుగు ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి తర్వాత చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ...పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ‘ఇడియట్’ చిత్రంతో హీరోగా మారాడు.  ఆ తర్వాత అంచెలంచెలుగా పైకి వచ్చిన రవితేజ ఎన్నో హిట్ చిత్రాలు తన ఖాతాలో వేసుకున్నాడు.  అయితే ‘పవర్’ చిత్రం తర్వాత  రవితేజకి బ్యాడ్ టైమ్ మొదలైంది.  వరుసగా వచ్చిన చిత్రాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. దాంతో ఇండస్ట్రీకి దాదాపు రెండు సంవత్సాలు దూరంగా ఉన్నారు.  ఇక ‘రాజా ది గ్రేట్’ చిత్రంతో మళ్లీ ఎంట్రీ ఇచ్చిన రవితేజ సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు.

ఈ చిత్రంలో పూర్తిగా అంధుడిగా కనిపించిన రవితేజ హీరోయిజం ఎక్కడా తగ్గకుండా మంచి కామెడీ పండించాడు..దాంతో మాస్ మహరాజా ఈజ్ బ్యాక్ అంటూ అభిమానులు తెగ సంబర పడిపోయారు.  రాజా ది గ్రేట్ హిట్ తర్వాత టచ్ చేసి చూడు, నేల టిక్కెట్టు అపజయం పొందాయి..దాంతో ఇప్పుడు సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో గతంలో ‘దుబాయ్ శీను’ లాంటి హిట్ చిత్రాన్ని అందించిన శ్రీను వైట్ల దర్శకత్వంలో 'అమర్ అక్బర్ అంటోని' చిత్రంలో నటిస్తున్నాడు.  ఈ చిత్రీకరణ పరంగా ఈ సినిమా ముగింపు దశకి చేరుకుంది.

రవితేజ మూడు డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్న ఈ సినిమాలో, ఆయన సరసన కథానాయికగా ఇలియానా నటిస్తోంది.  అంతా ఓకే అయితే ఈ చిత్రాన్ని అక్టోబర్ 5న రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ తెలిపింది.  కానీ..కొన్ని కారణాల వలన ఆ రోజున ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనను విరమించుకున్నారని సమాచారం.

డిసెంబర్ 14వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా చెబుతున్నారు.  మరీ రెండు నెలలు గ్యాప్ ఏంటా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.  ఇక దసరా సీజన్ లో వరుసగా పెద్ద చిత్రాలు రిలీజ్ కి ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో 'అమర్ అక్బర్ అంటోని' పోస్ట్ పోన్ చేసినట్లు ఫిల్మ్ నగర్లో వినిపిస్తోన్న టాక్.  ఏదేమైనా ఈ వార్త రవితేజ అభిమానులకు నిరాశను కలించేదేనని చెప్పుకోవాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: