రాజమౌళి క్రేజీ మల్టిస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ నవంబర్ నుంచి పట్టాలు ఎక్కబోతున్న నేపధ్యం తెలిసిందే. ఈమూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలను విజయదశమి రోజున నిర్వహించి ఈమూవీ రెగ్యులర్ షూటింగ్ నవంబర్ లో వచ్చే కార్తీకమాసంలో ప్రారంభం చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అవుతున్నాయి. 
RRR,SS Rajamouli,Ram Charan Teja
ఇలాంటి పరిస్థుతులలో ఈసినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. రాజమౌళి సినిమాలకు విజయేంద్ర ప్రసాద్ కథ సమకూర్చినా డైలాగ్స్ మాత్రం వేరే రచయితలు వ్రాస్తూ ఉంటారు. గంభీరమైన సంభాషణలు వ్రాయడంలో విజయేంద్ర ప్రసాద్ సామర్ధ్యం పై రాజమౌళికి పెద్దగా నమ్మకం లేకపోవడంతో రాజమౌళి ఇలా వ్యవహరిస్తూ ఉంటాడు. 

ఈనేపధ్యంలో తన మాటల పదునుతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుని క్రేజీ ప్రాజెక్ట్ లకు మాటల రచయితగా పనిచేస్తున్న బుర్రా సాయిమాధవ్ ను రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ కోసం తీసుకున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే ‘సైరా’ 'ఎన్టీఆర్' బయోపిక్ లాంటి సినిమాలతో పాటుగా ఇతర కమిట్మెంట్లు ఉన్నప్పటికీ రాజమౌళి అడగగానే బుర్రా సాయి మాధవ్ ‘ఆర్ఆర్ఆర్’ పదునైన మాటలు రచించే పనిలో బిజీగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.  
సాయి మాధవ్ బుర్రా
వాస్తవానికి ‘బాహుబలి’ సినిమాకు బుర్రా మాటల రచయితగా పని చేయవలసి ఉంది. కానీ కొన్ని కారణాలు వల్ల అప్పట్లో ఆ కాంబినేషన్ సెట్ కాలేదు. దీనితో ఇప్పుడు మళ్ళీ బుర్రా ‘ఆర్ఆర్ఆర్’ ప్రాజెక్ట్ లోకి రావడంతో కేవలం కథ పరంగా మాత్రమే కాకుండా డైలాగ్స్ విషయంలో కూడ రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ తీసుకుంటున్న జాగ్రత్తలకు ఇదే నిదర్శనం అంటూ ఇండస్ట్రీ వర్గాలలో వార్తలు హడావిడి చేస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: