పూర్వకాలంలో రాజులు తమ పరిపాలన గురించి ప్రజలు ఎలా మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవడానికి మారు వేషాలు వేసుకుని రాత్రి పూట జనం మధ్య తిరిగిన కథలను మనం చదువుకున్నాం. అయితే తన సినిమా ‘నన్నుదోచుకుందువటే’ టాక్ గురించి తెలుసుకోవడానికి సుధీర్ బాబు మారువేషాలు వేసుకుని భాగ్యనగరంలోని ధియేటర్ల చుట్టూ తిరిగిన సంఘటనలకు సంబంధించిన వార్తలు చాలమందికి షాక్ ఇచ్చాయి.
Sudheer Babu invites public reviews for Nannu Dochukunduvate
సుధీర్ బాబు ఎన్నో ఆశలు పెట్టుకుని నిర్మించిన ‘నన్నుదోచుకుందువటే’ మూవీ ఎందుకు సక్సస్ కాలేదు అని తెలుసుకునే ప్రయత్నాలలో ప్రేక్షకుల మధ్యకు తనను గుర్తుపట్టకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఈమూవీని ఎటువంటి హడావిడి లేకుండా సాధారణ ప్రేక్షకుడి ప్రక్కన సినిమా ప్రారంభం అయ్యాక వెళ్ళి కూర్చుంటున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రయోగం సుధీర్ బాబు ఒక్క ధియేటర్ లో కాకుండా చాల ధియేటర్ల లో ఇప్పటికే చేసినట్లు తెలుస్తోంది. 
sudheer babu,nannu dochukunduvate,director,rs naidu  సంచలన విషయం చెప్పిన సుధీర్‌బాబు
ఈప్రయత్నాలలో ఎవరైనా తనను అనుకోకుండా గుర్తుపడితే వారితో నవ్వుతూ మాట్లాడుతూ ఒక సెల్ఫీదిగి వచ్చేస్తున్నాడట. ఒకవేళ గుర్తుపట్టకపోతే సుధీర్ బాబు సైలెంట్ గా తన మూవీ పై ప్రేక్షకులు చేస్తున్న కామెంట్స్ ను నిశితంగా పరిశీలిస్తున్నాడట. నిన్న సిటీలోని ధియేటర్లు అన్నీ ఈవిధంగా ఒక చుట్టుచుట్టిన సుధీర్ బాబు ఈరోజు నుండి ఈసినిమా ప్రదర్శింపబడుతున్న ఆంధ్ర సీడెడ్ ఏరియాల్లో కూడా సుధీర్ బాబు ఇలా మారువేషాల్లో తిరుగుతాడని టాక్. 

ప్రస్తుతం సుధీర్ బాబు అనుసరిస్తున్న ఈకొత్త ట్రెండ్ టాపిక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అయితే ప్రస్తుత తరం ప్రేక్షకులు కథ విషయంలో టేకింగ్ విషయంలో వెరైటీ కోరుకుంటున్న నేపధ్యంలో అసలైన విషయాలను మరిచిపోయి ఒక రొటీన్ కథతో నిర్మించిన ‘నన్నుదోచుకుందువటే’ సినిమా గురించి మారువేషాల్లో తిరిగినా సుధీర్ బాబు కొత్తగా తెలుసుకునేది ఏమిటి అంటూ కొందరు జోక్స్ వేసుకుంటున్నారు..   



మరింత సమాచారం తెలుసుకోండి: