కన్నడ యాక్షన్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న దునియా విజయ్ ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తాడు.  విజయ్ కి సంబంధించి ఆ మద్య ఓ యాక్షన్ సీన్లో ఇద్దరు ఫైట్ మాస్టర్లు మృతి చెందిన విషయం తెలిసిందే.  దునియా విజయ్ పై ఇప్పుడు కిడ్నాప్, దాడి కేసు నమోదై అరెస్ట్ కాగా, ఆయన ఇద్దరు భార్యలూ గొడవపడి రోడ్డెక్కారు.   ఇప్పటికే జిమ్ ట్రైనర్ మారుతి గౌడతో వాగ్వాదానికి దిగి, ఆయన్ను కొట్టిన ఘటనలో విజయ్‌ తోపాటు మరో నలుగురిపై ఐపీసీ సెక్షన్ 323, 504, 506, 34సెక్షన్‌లకింద కేసులు నమోదయ్యాయి.

ఇదే సమయంలో ఆయన పెద్ద భార్య నాగరత్న, చిన్న భార్య కీర్తి గౌడలు గొడవ పడ్డారు. ఒకరిపై మరొకరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు. దునియా విజయ్ మొదటి భార్య నాగరత్నకి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం దునియా విజయ్ తన చిన్న భార్య కీర్తి గౌడతో కలిసి ఉంటున్నారు.  మారుతి గౌడతో గొడవ జరిగిన వేళ, నాగరత్న కుమారుడు సామ్రాట్‌, తన తండ్రితోనే ఉన్నాడు. తన కుమారుడు ఇంటికి రాకపోవడంతో ఆగ్రహానికి లోనైన నాగరత్న, కీర్తిగౌడ ఇంటికి వెళ్లి నిలదీయగా, ఆమె దగ్గరుండే బౌన్సర్లు అనుచితంగా ప్రవర్తించారట.

తన సంసారాన్ని కీర్తిగౌడ నాశనం చేసిందని, ఇప్పుడు పిల్లల్ని దూరం చేస్తోందని ఆరోపిస్తూ, తనపై బౌన్సర్లతో దాడి చేయించిందని గిరినగర్‌ పోలీస్‌ స్టేషన్‌ లో ఆమె ఫిర్యాదు చేసింది. అదే సమయంలో నాగరత్న తనపై దురుసుగా ప్రవర్తించిందని..దుర్భాషలాడిందని..కీర్తిగౌడ కూడా పోలీ‌స్‌ స్టేషన్‌ కు వెళ్ళి, నాగరత్న తన ఇంటిపై దాడి చేసిందని ప్రతి ఫిర్యాదు చేసింది. . ఓ వైపు భర్త విజయ్, అరెస్టయి, కోర్టుల చుట్టూ తిరుగుతున్న వేళ, ఆయన భార్యలిద్దరూ ఇలా రోడ్డెక్కి రచ్చరచ్చ చేయడం హాట్ టాపిక్ గా మారింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: