‘నా పేరు సూర్య’ ఘోర పరాజయం తరువాత షాక్ కు లోనైన అల్లు అర్జున్ ఎన్నోకథలు విని మరెన్నో ఆలోచనలు చేసిన తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ కథకు ఓకె చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ‘అరవింద సమేత’ రిజల్ట్ గురించి వేచి చూడకుండా ఇప్పటికే తాను రెండుసార్లు పనిచేసిన త్రివిక్రమ్ కాంబినేషన్ ను నమ్మి మూడవసారి అదే కాంబినేషన్ ను రిపీట్ చేయడానికి రంగం సిద్ధమైందని తెలుస్తోంది. 
Allu Arjun to take a Bold Step for his Next
ఈపరిస్థుతులు ఇలా ఉండగా బన్నీ మహేష్ చరణ్ లకు చెక్ పెట్టే విధంగా మరో షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడని వార్తలు వస్తున్నాయి.  ఇప్పటి దాకా అల్లుఅర్జున్ తనసినిమాలకు సంబంధించిన వ్యవహారాలన్నీ  తనతండ్రి గీత ఆర్ట్స్ ఆఫీస్ లోనే నడిపిస్తూ వచ్చాడు. ఆ ఆఫీసులోనే అల్లు అర్జున్ తనకోసం ఒక ప్రత్యేకమైన క్యాబిన్ ఏర్పాటు చేసుకుని తాను సినిమాలు చేయబోయే దర్శకుల కథలను వినే కార్యక్రమాలు చేస్తూ ఉండేవాడు.
allu-arjun-magazine-photo-shoot-stills-3
అయితే ఈమధ్య కాలంలో గీత ఆర్ట్స్ ప్రొడక్షన్ వ్యవహారాలు ఎక్కువ కావడంతో పాటు గీత ఆర్ట్స్ 2 పేరుతో బయట హీరోలతో వరసగా సినిమాలు నిర్మాణమవుతున్న నేపధ్యంలో బన్నీ తన సినిమాల విషయాలకు సంబంధించి ప్రైవసీ కోరుకుంటున్నట్లు టాక్. రామ్ చరణ్ తారక్ మహేష్ బాబుల తరహాలో ఒకభారీ సొంత ఆఫీసు బిల్డింగ్ ను ఏర్పాటు చేసుకోవడమే కాకుండా తన పిఆర్ టీమ్ ను కూడ మారుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
allu arjun, Sarrainodu, allu arjun Sarrainodu, allu arjun upcoming movies, allu arjun news, entertainment news
ముఖ్యంగా మహేష్ చరణ్ లు అనుసరిస్తున్నట్లుగా బ్రాండ్ డీలింగ్స్ అగ్రిమెంట్స్ చేయడానికి స్పెషల్ గా ఎంప్లొయ్స్ ని  అపాయింట్ చేసుకున్నట్టుతెలుస్తోంది. బ్రాండ్ ఎండార్స్ మెంట్ ఎగ్రిమెంట్లు అన్నీ ముంబాయ్ కి చెందిన యాడ్ ఏజెన్సీల నేతృత్వంలో జరుగుతున్న పరిస్థుతులలో ముంబాయ్ యాడ్ ఏజన్సీలతో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్న పిఆర్ టీమ్ ను భారీ జీతాలు ఇచ్చి అల్లు అర్జున్ తన వద్ద పెట్టుకుని బ్రాండ్ ఎండార్స్ మెంట్ల ద్వారా ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలను గణిస్తున్న మహేష్ చరణ్ ల వ్యూహాలకు చెక్ పెట్టె దిశలో బన్నీ ఈభారీ ఆఫీసు నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు అని అంటున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: