తెలుగు ఇండస్ట్రీలో ఈ సంవత్సరం సుకుమార్ దర్శకత్వంలో రాంచరణ్, సమంత నటించిన ‘రంగస్థలం’బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఈ చిత్రంతో రాంచరణ్ రెండు వందల కోట్ల క్లబ్ లో చేరిన మొదటి చిత్రం కావడం విశేషం. ప్రస్తుతం మెగా పవర్స్టార్ రామ్చరణ్ హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో డి వి వి దానయ్య ఒక మూవీని నిర్మిస్తున్నరు. డి.వి.వి.ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై రూపొందుతున్న మూవీ షూటింగ్ ఇటీవల హైదరాబాద్ లో జరిగింది. ఈ చిత్రంలో భారీ యాక్షన్ సీన్లు ఉన్నాయి.
హైదరాబాద్ లో షూటింగ్ ముగిసిన తర్వాత మలి షెడ్యూల్ షూటింగ్ అజర్ బైజాన్లో ఈ నెల 5వ తేదిన ప్రారంభమైంది.. అజర్బైజాన్లో భారీ ఖర్చుతో యాక్షన్ ఎపిసోడ్ తో సహా కీలక సన్నివేశాలను 20 రోజల పాటు నాన్ స్టాప్ గా చిత్రీకరించారు.. ప్రస్తుతం అజర్ బైజాన్ షెడ్యూల్ పూర్తి అయింది. అయింది.. అక్కడి నుంచి బయలుదేరి హైదరాబాద్ కు తిరిగివస్తున్నారు చిత్ర యూనిట్ సభ్యులు. ఇదిలా ఉంటే ఈ చిత్రం గతంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘స్టేట్ రౌడి’ టైటిల్ పెట్టబోతున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి.
ఫ్యామిలీ ఎమోషన్స్తో పాటు పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎలిమెంట్స్తో కమర్షియల్ ఎంటర్టైనర్గా సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి మిగిలిన షూటింగ్ హైదరాబాద్ లోనే పూర్తి చేయనున్నట్లు చిత్రయూనిట్ తెలిపింది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి వచ్చే సంక్రాంతికి వరల్డ్వైడ్గా గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు.
ఈ చిత్రంలో రామ్చరణ్, కైరా అద్వాని, ప్రశాంత్, వివేక్ ఒబెరాయ్, స్నేహ, హిమజ, ప్రవీణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి స్టిల్స్: జీవన్, పి.ఆర్.ఒ : వంశీ కాకా, మాటలు: ఎం.రత్నం, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర రావు, ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాష్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, కెమెరామెన్: రిషి పంజాబీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వి. వై.ప్రవీణ్ కుమార్, సహ నిర్మాత: కల్యాణ్ డి.వి.వి, నిర్మాత : దానయ్య డి.వి.వి, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: బోయపాటి శ్రీను.