అలనాటి అందాల తార శ్రీదేవి తనయ "దఢక్" సినిమా తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి అద్భుత హిట్ సాధించిన జాన్వీ కపూర్ తాజాగా మరో హిందీ సినిమాలో నటించటానికి అంగీకారం తెలిపింది. ఆమె తన తల్లి వారసత్వాన్ని పుణికి పుచ్చుకోనుందను కుంట. ఇప్పుడు ముందుగా జాన్వీ కపూర్ టాలీవుడ్ లో అడుగుపెట్టనుంది. ఆపై దక్షిణాది సినిమా పరిశ్రమలో నటించేందుకు సిద్ధమవుతోందని ఆమె తొలి సౌత్ సినిమా విజయ్ దేవరకొండకు జతగా నటించనుందని బాలీవుడ్ సమాచారం.
దక్షిణాదిలో అగ్రనటిగా ఒక వెలుగు వెలిగిన తన తల్లి శ్రీదేవి - తరవాతే బాలీవుడ్ లో ప్రవేసించి అక్కడ నంబర్ వన్ స్థానం సంపాదించారు. శరపరంపరగా అవకాశాలు అందిపుచ్చుకొని అదే లెవెల్లో బాలీవుడ్ లో విజయాలు మూటగట్తుకొని ఉత్తర దక్షిణ భారతం తేడా లేకుండా ప్రేక్షకులకు దగ్గరైన శ్రీదేవి, ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ను వివాహమాడారు. ఆ తర్వాత కొన్నాళ్లు సినిమాకు దూరమైనా, ప్రేక్షకులు మాత్రం ఆమెను ఎప్పుడూ మరిచిపోలేదు. తన నట వారసురాలిగా తన ప్రియ తనయ జాన్వీని చిత్రసీమకు పరిచయం చేయాలనేది శ్రీదేవి కోరిక. అది కరణ్ జోహార్ సినిమా "దఢక్" నెరవేరినా, ఆ విజయోత్సవాన్ని ఆశ్వాదించేందుకు ఆమే లేకుండాపోయారు. "దఢక్" సినిమా విడుదలకు ముందే శ్రీదేవి అనంతలోకాలకు చేరిపోయారు.
తన తల్లికి దక్షిణాదిలో ఉన్న పాపులారిటీ, ఆమె అభిమానులను దృష్టిలో పెట్టుకుని జాన్వీ తెలుగు సినిమా చేసేందుకు అత్యంత ఆసక్తి చూపుతున్నట్లు ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో నటించేందుకు సిద్ధమవుతున్నట్లు ఆమె సన్నిహితులు తెలిపారు. ఇదే సమయంలో తెలుగు నుంచి ఆమెకు ఆఫర్ వచ్చినట్లు తెలిసింది. మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న తర్వాతి చిత్రంలో విజయ్ దేవరకొండ నటించనున్నాడు. విజయ్ బంధువు యష్ రంగినేని కూడా ఈ సినిమాకు రెండో నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఈ సినిమాలో విజయ్కు జోడీగా నటించేందుకు జాన్వీ కపూర్ ను సంప్రదించగా ఆమె నుండి ఇంకా నిర్ణయం వెల్లడి కావలసి ఉందట. జాన్వీ ప్రస్తుతం ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కరణ్ జోహార్ నిర్మిస్తున్న ‘తఖ్త్’ అనే చారిత్రక చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం లో రణ్వీర్ సింగ్, కరీనా కపూర్, ఆలియా భట్, భూమి పెడ్నేకర్, విక్కీ కౌశల్ మొదలైన నటులు నటీమణులు నటిస్తున్నారు. అయితే జాన్వీ కపూర్ తెలుగు సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు సైతం ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. దేశంలోనే కాదు ప్రత్యేకించి దక్షిణాదిన శ్రీదేవి సాధించిన విజయం అనితర సాధ్యం.