తెలుగు చిత్రసీమ కళామతల్లికి రెండు కళ్లుగా మహానటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ అను అభివర్ణిస్తారు.  వీరు నటించిన ఎన్నో అద్భుతమైన చిత్రాలు ఎప్పటికీ మర్చిపోలేనివి..తెలుగు చిత్ర పరిశ్రమ ఉన్నంతకాలం గుర్తుండి పోయే విధంగా ఉంటాయని అందరికీ తెలిసిందే.  అయితే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఇద్దరు రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా స్నేహ సంబంధాలు కొనసాగించారు..అన్నదమ్ముల్లా కలిసి ఉన్నారు.  తెలుగు ఇండస్ట్రీలో క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఎన్టీఆర్’బయోపిక్.   

నందమూరి అభిమానులంతా 'ఎన్టీఆర్' బయోపిక్ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో చంద్రబాబునాయుడు పాత్రలో రానా .. అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో సుమంత్ , ఎన్టీఆర్ సతీమణిగా బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటిస్తున్న విషయం తెలిసిందే.   రీసెంట్ గా అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో సుమంత్ లుక్ ను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఎన్టీఆర్ .. ఏఎన్నార్ మధ్య ఆరోగ్యకరమైన పోటీ వుండేది. ఇద్దరి మధ్య ఎంతో సాన్నిహిత్యం ఉండేది.

ఈ కారణంగానే ఈ ఇద్దరూ కలిసి కొన్ని చిత్రాల్లో నటించారు. ఈ నేపథ్యంలో 'ఎన్టీఆర్' బయోపిక్ లో ఏఎన్నార్ ఎంతసేపు కనిపించనున్నారనేది ఆసక్తికరంగా మారింది.  టాలీవుడ్ వర్గాల సమాచారం మేరకు ఈ చిత్రంలో  ఏఎన్నార్ కు దక్కింది కేవలం మూడు సన్నివేశాలే అని తెలుస్తోంది.

అది కూడా కేవలం మొక్కుబడిగా మాత్రమేనని, ఎన్టీఆర్- ఏఎన్నార్ మంచి మిత్రులు కావడంతో వారిద్దరూ సన్నిహితంగా ఉన్న సీన్లను పెట్టారని సమాచారం. రాజకీయాలలోకి రావడానికి ముందు ఏఎన్నార్ తో ఎన్టీఆర్ జరిపిన ఆసక్తికరమైన చర్చ హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. సంక్రాంతికి ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.   
 



మరింత సమాచారం తెలుసుకోండి: