ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో కొత్త దర్శకులు, కొత్త హీరోల జోరు బాగా పెరిగిపోయింది. పెళ్లి చూపులు సినిమాతో తరుణ్ భాస్కర్ మంచి విజయం అందుకున్నాడు. ఈ చిత్రంతో విజయ్ దేవరకొండకు కూడా మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ వంగా దర్శకత్వంలో వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఈ రెండు చిత్రాలతో పాటు ఈ మద్య విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన ‘గీతాగోవిందం’తో ఏకంగా స్టార్ రేంజ్ లోకి వెళ్లాడు.
ఇక ఎలాంటి అంచనాలు లేకుండా..చిన్న చిత్రంలో థియేటర్లో రిలీజ్ అయిన ‘ఆర్ ఎస్ 100’ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. కేవలం కోటిన్నర బడ్జెట్ తో రిలీజ్ అయిన ‘ఆర్ ఎస్ 100’ఏకంగా పన్నెండు కోట్లు కొల్లగొట్టడమే కాదు..ఇంకా కలెక్షన్లు రాబడుతూనే ఉంది. కార్తికేయ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా, యూత్ ను ఒక రేంజ్ లో ఆకట్టుకుంది. ఈ సినిమాతో వచ్చిన క్రేజ్ కారణంగా దర్శకుడు అజయ్ భూపతి మరో సినిమాను ప్లాన్ చేసుకుంటున్నాడు. సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ శిశ్యుడైన అజయ్ భూపతి ఇప్పుడు వరుసగా ఛాన్సులు దక్కించుకుంటున్నారు.
ఆ మద్య రామ్ .. దుల్కర్ సల్మాన్ హీరోలుగా మల్టీ స్టారర్ చేసే ఉద్దేశంతో ఉన్నాడనే టాక్ కూడా వినిపించింది. కానీ ఆ ప్రాజెక్ట్ పక్కన బెట్టి ఇప్పుడు నితిన్ హీరోగా కథను లాక్ చేసుకుని, త్వరలో సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతున్నాడని అంటున్నారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రం నిర్మితం కానున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కథానాయికల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోందని అంటున్నారు.