బాలీవుడ్ లో గత కొన్ని రోజుల నుంచి వరుసగా సంచలన వ్యాఖ్యలు చేస్తూ..హల్ చల్ సృష్టిస్తున్న తనుశ్రీ దత్తా కు ప్రముఖ నటులు, సామాజిక వేత్త నానా పటేకర్  లీగల్ నోటీసులు పంపించినట్లు వార్తలు వస్తున్నాయి.  2008లో ‘హార్న్ ఓకే ప్లీజ్’ సినిమా షూటింగ్ సమయంలో నానా పటేకర్  తనను లైంగికంగా వేధించాడని ఇటీవల తనుశ్రీ దత్తా ఆరోపించింది.   కేవలం అతనే కాకుండా కొరియోగ్రఫర్ గణేశ్ ఆచార్య, దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి కూడా తనను వేధించారని ఆరోపించిన విషయం తెలిసిందే. 

ఈ విషయం పై కొరియోగ్రఫర్ గణేశ్ ఆచార్య స్పందించి..ఆ సాంగ్ షూట్ చేసే సమయంలో వంద మంది ఉన్నారని..నానా పటేకర్ అలా అసభ్యంగా ప్రవర్తించి ఉంటే..బయటకు తెలిసేదని..ఆయన మంచి వ్యక్తి అని కావాలనే తనుశ్రీ దత్తా ఆరోపణలు చేస్తుందిని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఈ నేపథ్యంలో బాలీవుడ్ లో లైంగిక వేధింపుల వ్యవహారం మరింత ముదురుతోంది.

తనుశ్రీ దత్తా తనపై చేసిన తప్పుడు ఆరోపణలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పటేకర్ తన న్యాయవాది రాజేంద్ర శిరోద్కర్ ద్వారా తను శ్రీ దత్తాకు నోటీసులు పంపారు. కాగా తనుశ్రీ దత్తాకు ప్రియాంకా చోప్రా, ట్వింకిల్ ఖన్నా, ఫర్హాన్ అక్తర్ సహా పలువురు సెలబ్రిటీలు మద్దతు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: