తెలుగు ఇండస్ట్రీలో పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతాగోవిందం చిత్రాలతో స్టార్ హీరో రేంజ్ కి ఎదిగాడు.  ఇండస్ట్రీలో ఇంత తక్కువ సమయంలో ఈ హోదా రావడం నిజంగా విజయ్ దేవరకొండ అదృష్టం అనే చెప్పాలి.  తాజాగా విజయ్ దేవరకొండ నటించిన ‘నోటా’ చిత్రం వచ్చే నెల 5 న రిలీజ్ చేయడానికి సిద్దంగా ఉందన్న విషయం తెలిసిందే.  ఈ చిత్రంతో మొదటి సారిగా విజయ్ దేవరకొండ తమిళ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నాడు.  పొలిటికల్ డ్రామా గా రానున్నఈ చిత్రం తో ఆయన తమిళ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు.


ఇరుముగన్ దర్శకుడు ఆనంద్ శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రంలో మెహ్రీన్ జర్నలిస్ట్ పాత్రలో నటిచింది.. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా క్లీన్ ‘యూ’ సర్టిఫికెట్ పొందింది. ఇక ఈ చిత్రాన్ని కేవలం 48 రోజుల్లోనే పూర్తి చేశారట. ఆ తరువాత పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించారట. ఈచిత్రం యొక్క తమిళ వెర్షన్ ఈ రోజు సెన్సార్ కు వెళ్ళింది.


సెన్సార్ బోర్డు ఈచిత్రానికి ‘యు’ సర్టిఫికెట్ ఇచ్చింది. స్టూడియో గ్రీన్ పతాకం ఫై జ్ఞానవేల్ రాజా నిర్మించారు.   ఇక ఇటీవల విజయ్ నటించిన ‘గీత గోవిందం’ తమిళనాడులో విడుదలై నాన్ బాహుబలి రికార్డ్స్ ను బద్దలు కొట్టింది. దాంతో ఈ నోటా చిత్రానికి అక్కడ మంచి బజ్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం విభిన్నరీతిలో ప్రమోషన్స్ చేస్తున్న చిత్రయూనిట్.. సెప్టెంబర్‌ 30న విజయవాడలో, అక్టోబర్‌ 1న హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: