వరస పరాజయాలతో సతమతమైపోతు పెరిగిపోతున్న యంగ్ హీరోల పోటీకి తట్టుకోలేకపోయిన సాయిధరమ్ తేజ్ తో సినిమాలు తీయడానికి ఇప్పటికీ కొంతమంది ఆసక్తి కనపరుస్తున్నా తనకు తానుగా అజ్ఞాతవాసం లోకి ఈమెగా మేనల్లుడు వెళ్ళిపోయిన విషయం తెలిసిందే. తన లుక్ విషయంలో ముఖ్యంగా తన లావును తగ్గించుకుని స్లిమ్ గా తయారు కావడానికి తేజ్ అమెరికా వెళ్ళిన్నట్లు గతంలోనే వార్తలు వచ్చాయి.
అయితే సాయి ధరమ్ తేజ్ తన శరీర బరువును తగ్గించుకుని స్లిమ్ గా తయారై తన హెయిర్ స్టైల్ ను కూడ మార్చుకుని ఇప్పుడు గుడ్ లుక్ తో అమెరికా నుండి తిరిగి వచ్చి చాల రోజులు అవుతున్నా తేజ్ ప్రస్తుతం ఎవర్ని కలవడానికి ఇష్టపడటం లేదని టాక్. తనను కలిసి కథలు చెప్పాలని ప్రయత్నాలు చేస్తున్న కొందరు యువ దర్శకులను కూడ తేజ్ కలవడానికి ఏమాత్రం ఆసక్తి కనపరచడం లేదు అని అంటున్నారు.
దీనికి కారణం ప్రస్తుతం ఈ మెగా మేనల్లుడు చేతిలో ఉన్న ఒకే ఒక్క సినిమా ‘చిత్ర లహరి బార్ అండ్ రెస్టారెంట్’ కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈమూవీ షూటింగ్ త్వరలో ప్రారంభించి ఆమూవీ ఫస్ట్ లుక్ ను విడుదల చేయడం ద్వారా తేజ్ తన మారిన లుక్ ను అందరికీ పరచయం చేయాలని భావిస్తున్నాడు. అందుకోసమే ఈమూవీ షూటింగ్ ప్రారంభం అయ్యేదాకా తేజ్ ఎవర్ని కలవకూడదని నిశ్చయించుకున్నట్లు తెలుస్తోంది.
తన రెండవ సినిమాతోనే తేజ్ 25 కోట్ల కలక్షన్స్ హీరోగా మారినా ఆతరువాత మారిన పరిస్థుతులలో వరస విజయాలు వరస పరాజయాలుగా మారి ఏకంగా 6 ఫెయిల్యూర్స్ తో సతమతమైపోతున్న తేజ్ కు నటుడుగా మంచి వ్యక్తిగా పేరు వచ్చినా అదృష్టం దూరం కావడం హాట్ న్యూస్ గా మారింది. దీనితో ఆఖరి ప్రయత్నంగా వస్తున్న ‘చిత్రలహరి బార్ అండ్ రెస్టారెంట్’ విజయవంతం కాకపోతే ఇక ఈమెగా మేనల్లుడి కెరియర్ కష్టమే అన్న నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి..