నిన్నటితో ముగిసిన ‘బిగ్ బాస్ 2’ షో విజేతగా అందరూ ఊహించినట్లుగానే కౌశల్ ఎంపిక కావడంతో చివరి నిముషంలో ఎటువంటి ట్విస్టులు లేకుండా ‘బిగ్ బాస్ 2’ షో ముగిసింది. అయితే నిన్న జరిగిన ఈ ఆఖరి రోజు కార్యక్రమం జరిగిన అన్నపూర్ణ స్టూడియోస్ బయట వేలాదిమంది కౌశల్ అభిమానులు కౌశల్ కు జైజైలు పలుకుతూ చేసిన హంగామా మటుకు ఒక సూపర్ స్టార్ ఇమేజ్ స్థాయిలో ఉండటం అందర్నీ ఆశ్చర్య పరిచింది.
విజేతగా కౌశల్‌ను ప్రకటించిన వెంకటేష్
దీనికితోడు నిన్న మధ్యాన్నం నుండి అన్నపూర్ణా స్టూడియోస్ కు వెళ్ళే దారి వందలాది కౌశల్ అభిమానులతో బ్లాక్ కావడంతో కౌశల్ గురించి తెలియని వారు కూడ అతడి గురించి మాట్లాడుకునేలా చేసింది. నిన్నటి కార్యక్రమం ముగిసిన తరువాత ఒక ప్రత్యేకమైన వాహనంలో కౌశల్ తన ‘బిగ్ బాస్ 2’ షీల్డ్ తో అన్నపూర్ణ స్త్తోదియోస్ బయటకు వచ్చి తన అభిమానులకు చేసిన వందనం ఒక సూపర్ స్టార్ ఇమేజ్ తీరులో ఉంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
 ఇంట్రస్టింగ్‌గా వెంకటేష్ ఎంట్రీ
నిన్నటిరోజు తనకు వచ్చిన 50 లక్షల ప్రైజ్ మనీని కౌశల్ కేన్సర్ తో చనిపోయిన తన తల్లి జ్ఞాపకాలను గుర్తుకు చేసుకుంటూ వారికోసం ఖర్చు పెడతాను అని అనడంతో కౌశల్ ఇమేజ్ మరింత తారా స్థాయికి చేరిపోయింది. అయితే ఆశ్చర్యకరంగా స్టార్ మా యాజమాన్యం ఈకార్యక్రమంలో విజేతగా ఎంపిక అయిన కౌశల్ కు కానీ రెండవ స్థానంలో వచ్చిన గీతా మాధురికి కానీ ఎవరుకు ఎన్ని ఓట్లు వచ్చాయో తెలియచేయకుండా కేవలం కౌశల్ కు అత్యధిక ఓట్లు వచ్చాయి అని స్టార్ మా యాజమాన్యం చెప్పి ఈ కార్యక్రమం ముగించడం వెనుక ఆంతర్యం ఏమిటి అంటూ మరికొందరు కామెంట్స్ చేసుకున్నట్లు టాక్.
 క్యాన్సర్‌ రోగులకు 50 లక్షల విరాళం
గత సంవత్సరం ప్రసారం అయిన ‘బిగ్ బాస్’ సీజన్ 1 కార్యక్రమంలో చివరి ఫైనలిస్ట్ లు అందరికీ ఎవరికీ ఎన్ని ఓట్లు వచ్చాయో చెప్పిన ‘స్టార్ మా’ ఈసారి తన పద్ధతి మార్చడం వెనుక ఎదో ఒక బలమైన కారణం ఉంది అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక ఈకార్యక్రమంలో చివరిగా నాని అందర్నీ నెగిటివ్ గా ఆలోచించడం మాని పాజిటివ్ గా ఆలోచించండి అన్న పిలుపు ఇవ్వడంతో ఇక్కడి నుండైనా తన జరిగిన నెగిటివ్ ప్రచారాన్ని ఆపమని పరోక్షంగా బుల్లితెర ప్రేక్షకులను అభ్యర్ధించినట్లు అర్ధం అవుతుంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: