తెలుగు ఇండస్ట్రీలో నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి మెప్పించారు.  ఆయన నటించిన కామెడీ చిత్రాలు ఇప్పటికీ..ఎప్పటికీ మర్చిపోలేనివి.  ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన రాజేంద్ర ప్రసాద్ తండ్రి, మామ పాత్రల్లో నటిస్తున్నారు.  తాజాగా సంజోష్ .. హర్షిత జంటగా రమేశ్ చెప్పల దర్శకత్వంలో 'బేవర్స్' సినిమా రూపొందింది.

ఈ సినిమా పేరు వినగానే ఇటీవల ట్రైలర్లో 'తొండముదిరి ఊసరవెల్లి అయినట్టు .. మా ఎదవ ముదిరి బేవర్స్ అయ్యాడు' అంటూ రాజేంద్రప్రసాద్ చెప్పిన డైలాగ్  బాగా పాపులర్ అయ్యింది.  తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ అయ్యింది.  ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ కార్యక్రమానికి విచ్చేసిన అభిమానులను ఎంతో సంతోష పరిచారు. 

ఈ సందర్బంగా హీరో పక్కన నిల్చున్న హీరోయిన్ ని తన పక్కన నిల్చోవచ్చుకదా అంటూ ఆటపట్టించాడు.  ఆ సమయంలో  వేదికపై వున్న ఆదిని ఉద్దేశించి .. కుళ్లుకోవద్దని అన్నారు.  వెంటనే ఆది ఏదో మాట్లాడే సమయానికే..'నీ కంటే ముందు నుంచి పంచ్ లు వేసినవాడినిరా బాబూ నేను' అన్నారు. ఆది అనేవాడు పుట్టక ముందు నుంచి అల్లరి చేస్తున్నవాడు రాజేంద్ర ప్రసాద్' అంటూ నవ్వేశారు.    


మరింత సమాచారం తెలుసుకోండి: