నిన్నరాత్రి జరిగిన ‘అరవింద సమేత’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ రొటీన్ సినిమా ఫంక్షన్స్ కు భిన్నంగా ఎమోషనల్ టచ్ తో ఇంచుమించు హరికృష్ణ సంతాప సభగా మారింది. వేదిక పై నవ్వుతూ ఎప్పుడూ హడావిడి చేసే జూనియర్ తన తీరుకు భిన్నంగా నిన్న కనిపించడమే కాకుండా అనేక సార్లు తారక్ తన తండ్రిని గుర్తుకు చేసుకుంటూ కన్నీటి పర్యంతం అవ్వడం ఈ ఫంక్షన్ కు వచ్చిన వారందర్నీ కదిలించి వేసింది.
trivikram speech at aravinda sametha pre release event
ఈమూవీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రం ఈ ఫంక్షన్ లో కేవలం మూడు ముక్కలు ముక్తసరిగా మాట్లాడి ముగించాడు. వాస్తవానికి ఈ ఫంక్షన్ లో అందరి కంటే ఎక్కువగా త్రివిక్రమ్ మాట్లాడతాడు అంటూ లీకులు వచ్చాయి. అయితే దీనికి భిన్నంగా త్రివిక్రమ్ ప్రవర్తన ఉండటం చాలామందిని ఆశ్చర్య పరిచింది. 
Trivikram-srinivas-director.jpg
అయితే ఒకవైపు జూనియర్ కళ్యాణ్ రామ్ లు తమ తండ్రి హరికృష్ణను గుర్తుకు చేసుకుంటూ బోరున విలపిస్తూ ఉంటే త్రివిక్రమ్ నోటి వెంట హరికృష్ణ మరణం గురించి కానీ జూనియర్ పడుతున్న వ్యధను గురించి కానీ ప్రస్తావన లేకుండా ‘అరవింద సమేత’ జూనియర్ అభిమానులందరికీ నచ్చే సినిమా అంటూ ముక్త సరిగా మాట్లాడి ముగించాడు. 
అతి పెద్ద విషాదం నుండి తొందరగా కోలుకున్నాడు: ఎన్టీఆర్ గురించి త్రివిక్రమ్
దీనితో విలక్షణమైన త్రివిక్రమ్ తీరును చూసినవారు ‘అరవింద సమేత’ రిజల్ట్ గురించి త్రివిక్రమ్ పడుతున్న టెన్షన్ లో హరికృష్ణ మరణం ప్రస్తావన కూడ త్రివిక్రమ్ మరిచిపోయాడు అంటూ కామెంట్స్ చేసుకున్నారు. వాస్తవానికి ‘అరవింద సమేత’ రిజల్ట్ లో తేడా వచ్చినా జూనియర్ కు రాజమౌళి తీస్తున్న భారీ మల్టీ స్టారర్ చేతిలో ఉంది. అయితే ‘అరవింద సమేత’ రిజల్ట్ లో తేడాలు వస్తే ఇప్పటికే ‘అజ్ఞాతవాసి’ తో ఇమేజ్ పోగొట్టుకున్న త్రివిక్రమ్ పరిస్థితి మరింత అయోమయం అయిపోతుంది కాబట్టి ఆ టెన్షన్ లో నిన్నటి ఈవెంట్ లో త్రివిక్రమ్ నోటి నుంచి ఎక్కువ మాటలు రాలేదు అన్న రకరకాల అభిప్రాయాలు వ్యక్త మౌతున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: