తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు కి ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే.  ఇక ఆయన సతీమణి నమ్రత శిరోద్కర్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తమ ఫ్యామిలీకి సంబంధించిన పర్సనల్ విషయాలు అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు.  మహేష్ బాబుకు షూటింగ్ లేకుంటే కుటుంబమే ఆయన ప్రపంచం. పూర్తి సమయం ఫ్యామిలీతో గడిపేస్తుంటారు.  షూటింగ్ లో ఏమాత్రం విరామం దొరికినా..తన కుటుంబంతో హ్యాపీగా గడిపేస్తుంటారు. ముఖ్యంగా ఆయన కూతురు సితార అంటే పంచ ప్రాణాలు.
 రేర్ మూమెంట్స్
తన కూతురిలో తన తల్లిని చూసుకుంటున్నానని పలు మార్లు చెప్పిన విషయం తెలిసిందే.  ఇక మహేష్ బాబు సంవత్సరంలో కనీసం నాలుగు సార్లయినా విదేశీ ట్రిప్స్ వేస్తుంటారు. పిల్లలకు స్వయంగా ఈ ప్రపంచాన్ని పరిచయం చేస్తూ లోకంలోని వింతలు చూసి వారు ఆనంద పడుతుంటే చూసి మురిసిపోతుంటారు.  తాజాగా నమ్రత చేసిన ఓ ట్వీట్ హాట్ టాపిక్ అయింది. నమ్రత ట్వీట్ చేసిన ఫోటోలో.... మహేష్ బాబు, సితార ఆదమరిచి నిద్ర పోతున్నట్లు ఉంది. అయితే ఈ ఫోటో చూసి మోసపోవద్దు అనే అర్థం వచ్చేలా ఆమె ఓ హింట్ ఇచ్చారు.
 పిల్లలకు ఈ ప్రపంచాన్ని పరిచయం చేస్తూ
ఈ ఫోటోకు ప్రిడెండర్స్ అనే క్యాప్సన్ కూడా ఇచ్చింది.   ఇక సితార, మహేష్ బాబు కలిస్తే మామూలుగా ఉండదు. అల్లరి చేసినా, ఆటలాడినా తన కూతుతోనే. వారు అలా సరదాగా గడుపుతుంటే నమ్రత ఆ హ్యాపీ మూమెంట్స్‌ను కెమెరాతో బంధించి అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. మహేష్ బాబు తన కూతురు సితారతో ఖుషీ..ఖుషీగా అల్లరి చేస్తూన్న సమయంలో నమ్రత తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి.  మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.  ఈ చిత్రంలో మహేష్ సరసన పూజా హెగ్డే నటిస్తుంది. మరో ముఖ్యమైన పాత్రలో అల్లరి నరేష్ నటిస్తున్నాడు. అశ్వినీదత్, దిల్ రాజు, పివిపి నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 5, 2019లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: