టాలీవుడ్ లో గత నెల అక్కినేని ఫ్యామిలీ సినిమాల సందడితో దుమ్మురేపారు. అక్కినేని నాగార్జున, నాని కాంబినేషన్ లో వచ్చిన ‘దేవదాస్’, అక్కినేని నాగ చైతన్య నటించిన ‘శైలజారెడ్డి అల్లుడు’, సమంత అక్కినేని నటించిన ‘యూటర్న్’చిత్రాలు సందడి చేశాయి. ఈ మూడు చిత్రాలు కూడా మంచి రెస్పాన్స్ రావడంతో కలెక్షన్లు కూడా బాగానే రాబట్టాయి.
అయితే సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య పెళ్లైన తర్వాత రిలీజ్ అయిన చిత్రాలతో బాగా ఎంజాయ్ చేశారు. దాంతో ఈ జంట విదేశాలకు టూర్ పై వెళ్లారు. వారితో ఈ మద్య నాగార్జున, అమల కూడా జాయిన్ అయ్యారు. కింగ్ నాగార్జున కుటుంబంతో కలిసి హాలిడే ట్రిప్కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇటీవల ‘దేవదాస్’ సినిమా రిలీజ్కు ముందే సినిమాను చూసేసి హాలిడే ట్రిప్కు వెళుతున్నానని నాగ్ ట్వీట్ చేశారు.
ట్రిప్లో బాగా ఎంజాయ్ చేసిన పిక్స్ను ఎప్పటికప్పుడు సమంత, నాగ చైతన్య జంట సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూనే ఉంది. నేడు ట్రిప్ నుంచి తిరిగి వస్తున్నట్టు నాగ్ తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. ‘హాలిడే కల పూర్తైంది. మళ్లీ లైఫ్లోకి... రియాలిటీకి తిరిగి వస్తున్నా’ అంటూ ట్వీట్లో పేర్కొన్నారు నాగ్.