హాలీవుడ్లో ప్రకంపనలు సృష్టించిన మీటూ ఉద్యమం ఇప్పుడు బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్లలో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఇటీవల బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా.. నానా పటేకర్ తనని లైంగిక వేధించాడని సంచలన ఆరోపణలు చేయడంతో పాటు మీటూ ఉద్యమం ప్రారంభించింది. ఇప్పటికే తెలుగులో శ్రీరెడ్డి ప్రస్తావించిన కాస్టింగ్ కౌచ్ అన్ని ఇండస్ట్రీలో ఉద్యమంలా వ్యాపిస్తుంది. గతంలో హీరోయిన్లు తమ పట్ల జరిగిన అన్యాయాలను..లైంగిక వేధింపులను ఒక్కొక్కటిగా బయట పెడుతున్నారు. ప్రముఖ గాయని చిన్మయి తను కూడా అనేక లైంగిక వేధింపుల బారినపడ్డట్టు తెలియజేయగా, ఆమె మీటూ ఉద్యమాన్ని ఉదృతం చేస్తుంది.
ప్రముఖ రచయిత వైరముత్తు రామస్వామి, కార్తీక్ టీఎం పలువురిని లైంగిక వేధింపులకి గురి చేసారని చిన్నయి ట్వీట్స్ని బట్టి అర్ధమవుతుంది. వైరముత్తు పద్మభూషణ్ అవార్డుతో పాటు పలు జాతీయ అవార్డులు అందుకున్నాడు. ఎన్నో విజయవంతమైన సినిమాలకి పాటలు రాసిన వైరముత్తు తన దగ్గర పని చేసే యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడట. ఆ యువతి భయంకరమైన నిజాలని సంధ్యా మీనన్ అనే జర్నలిస్ట్తో చెప్పుకోగా, ఆ వివరాలని సంధ్యారాణి తన ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది. అతనితో ఒంటరిగా ఉండాలంటే యువతికి వణుకు వచ్చేదని వివరించింది. ఇండస్ట్రీలో అతనో ప్రిడేటర్లాంటి వాడు. కానీ అతనికి వ్యతిరేకంగా ఎవరూ ఏం మాట్లడలేరు.
అతని బ్యాగ్ గ్రౌండ్ చాలా పెద్దది కావడంతో ఎవరూ ఎదురు తిరిగే వారు కాదని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా, వైరముత్తు గురించి అందరికి తెలుసు కాని ఎవరు పట్టించుకోరు అని బాధితురాలు పేర్కొంది. అయితే ఈ ట్వీట్పై చిన్మయి, సమంత, రాహుల్ రవీంద్రన్, దర్శకుడు సీఎస్ అముధాన్ స్పందించారు. మీటూ ఉద్యమానికి తమ సపోర్ట్ అందిస్తామని అన్నారు. చిన్మయి మొదలు పెట్టిన మీ టూ ఉద్యమం ఉదృతంగా మారడంతో ఇంకెన్ని విషయాలు బయటికి వస్తాయో చూడాలి.