టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్లో సందడి చేశాడు. ఎప్పుడూ క్రికెట్ గ్రౌండ్లో బిజీగా ఉండే కోహ్లి కాస్త గ్యాప్ తీసుకొని షూటింగ్లకు కూడా హాజరవుతున్నాడు. విరాట్ కోహ్లీ అంటేనే న్యూస్ కి కేరాఫ్ అడ్రాస్ అంటారు. అలాంటిది ఇప్పుడు అన్న పూర్ణ స్టూడియోలో చేసిన సందడి అంతా ఇంతా కాదు. వెస్టిండీస్తో ఉప్పల్ వేదికగా జరగనున్న రెండో టెస్టు మ్యాచ్లో ఆడేందుకు హైదరాబాద్కి వచ్చిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లి.. కాసేపు అన్నపూర్ణ స్టూడియోస్లో సందడి చేశాడు.
శుక్రవారం నుంచి మ్యాచ్ జరగనుండగా.. మంగళవారం సాయంత్రం భారత్, వెస్టిండీస్ ఆటగాళ్లు ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. తన భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మతో కలిసి నిన్న హైదరాబాద్కి చేరుకున్న కోహ్లి.. ఓ యాడ్ షూటింగ్లో భాగంగా అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్లినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇక స్టూడియోలో అఖిల్ అక్కినేనితో కలిసి కోహ్లీ ముచ్చటిస్తున్న ఫొటోలు సామాజిక మాధ్యమాలకు చేరాయి.
ఇదిలా ఉండగా, కోహ్లీపై ఓ వాణిజ్య ప్రకటన చిత్రీకరించనున్న నేపథ్యంలోనే స్టూడియోకు వెళ్లినట్టు సంబంధిత వర్గాల సమాచారం. చదువుకునే రోజుల్లో క్రికెట్పై మక్కువ పెంచుకున్న అఖిల్.. ఆస్ట్రేలియాలో శిక్షణ కూడా తీసుకున్నాడు. ఏటా జరిగే.. సెలబ్రిటీ ప్రీమియర్ లీగ్ (సీసీఎల్) తెలుగు వారియర్స్ టీమ్కి అఖిల్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.