టాలీవుడ్, బాలీవుడ్ లో సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రాంగోపాల్ వర్మ ‘ఆఫీసర్’చిత్రం పరాజయం తరువాత ఆర్జీవీ కొంత కాలం మౌనం వహించాడు.  గత కొంత కాలంగా రాంగోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా చేసుకొని ఎన్నో సంచలనాలు సృష్టించిన విషయం తెలిసిందే. ఇండస్ట్రీలో బయోపిక్ చిత్రాలు వరుసగా వస్తున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం వస్తుంది. ఈ చిత్రం అనౌన్స్ చేసిన కొత్తలో రాంగోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలిపాడు. 

ఆ తర్వాత ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ప్రాజెక్ట్ ని పక్కన పడేశారని టాక్ వచ్చింది.  తాజాగా ఈ చిత్రం  త్వరలోనే ప్రారంభించనున్నట్లు,  ముహూర్తం కూడా కుదిరిందని రాంగోపాల్ వర్మ తాజాగా ప్రకటించాడు. వర్మ ప్రకటనతో ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో మరోమారు వివాదం చెలరేగినట్లు అయింది. వరుస ట్వీట్స్‌తో లక్ష్మిస్ ఎన్టీఆర్ చిత్రంపై వర్మ సంచలన ప్రకటన చేయడం ఆసక్తికాగా మారింది.ఈ చిత్రం గురించి మరిన్ని విశేషాలు అక్టోబర్ 19న తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించి వెల్లడిస్తామని వర్మ తెలిపాడు.
Related image
హఠాత్తుగా వర్మ ప్రకటన చేయడంపై సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.   కాగా, ఈ మద్య  ఓ చిన్న వీడియోను పోస్టు చేస్తూ, అందులో అచ్చం చంద్రబాబులా కనిపిస్తున్న ఓ హోటల్ వెయిటర్ ను చూపించిన వర్మ, అతను ఎవరో తెలిస్తే చెప్పాలని, అతనికి రూ. లక్ష ఇస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో  ముత్యాల రోహిత్ అనే యువకుడు, అతని ఆచూకీపై వర్మకు సమాచారం అందించాడట. ఇక అదే విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో తెలిపిన వర్మ, రోహిత్ కు కృతజ్ఞతలు తెలిపాడు. సినిమా ప్రారంభంలో అతని పేరును తెరపై వేస్తామని, వెంటనే బ్యాంకు ఖాతా వివరాలు తెలియజేయాలని, ఆ వెంటనే తాను ప్రకటించిన లక్ష రూపాయలను పంపుతానని చెప్పాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: