దేశమంతా ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్న మీటూ ఉద్యమం తెలుగు ఇండస్ట్రీలో మొదలు పెట్టింది శ్రీరెడ్డి. అంతకు ముందు హీరోయిన్లు బహిరంగంగా ఈ విషయాలు వెల్లడించలేదు. ప్రస్తుతం కొనసాగుతున్న ‘మీటూ ’ ఉద్యమాన్ని తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని చెప్పింది. తెలుగు ఇండస్ట్రీలో ఉన్న కాస్టింగ్ కౌచ్ గురించి ఉతికి ఆరేసింది. తాజాగా ఆర్మూరు నియోజకవర్గం టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తనను లైంగికంగా వేధించారని తీవ్ర ఆరోపణలు చేసింది. జాతీయ మీడియా 'న్యూస్ ఎక్స్'కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో ఆమె ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది.
ప్రస్తుతం చెన్నైలో ఉంటున్న శ్రీరెడ్డి.. అక్కడి మీడియాకు ఓ ఇంటర్యూ ఇచ్చారు. “మీ టూ” ఉద్యమంపై స్పందిస్తూ.. తనకు ఎదురైన అనుభవాల్ని వివరించారు. ఆ క్రమంలో… జీవన్ రెడ్డి ప్రస్తావన తీసుకొచ్చారు. జీవన్ రెడ్డి హైదరాబాద్లోని పార్క్హయత్ హోటల్లో తనపై వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. అతడికి అమ్మాయిలంటే పిచ్చి అని చెప్పింది. గతంలో తనను తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది వాడుకున్నారని.. తను కూడా చాలా మందితో పడుకున్నానని.. తానేం ఇప్పుడు పతివ్రత అని చెప్పడం లేదని ఓపెన్గానే అన్ని నిజాలు ఒప్పుకుంది శ్రీరెడ్డి. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పెద్ద మోసగాడన్నారు.
అతనికి నిర్మాత బెల్లంకొండ సురేశ్ సహాయం చేశాడు. అతడు ప్రతి రోజు ఫోన్ చేసి వేధింపులకు పాల్పడేవాడు. తాము అధికారంలో ఉన్నామని బెదిరింపులకు దిగేవాడని శ్రీరెడ్డి గుర్తు చేసుకున్నారు. జీవన్ రెడ్డి తనను చాలా సార్లు లైంగికంగా వేధించాడని ఆమె పేర్కొంది. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో శ్రీరెడ్డి ఆరోపణలు విపక్షాలకు ఆయుధాలుగా మారనున్నాయి.
ప్రముఖ తమిళ్ న్యూస్ చానల్కి ఇచ్చిన ఇంటర్యూలో శ్రీరెడ్డి ఈ రాజకీయ నాయకుడిపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక్క జీవన్ రెడ్డి పేరు మాత్రమే కాదు.. ఈ ఇంటర్వ్యూలో లారెన్స్ పేరు కూడా బయటపెట్టింది శ్రీరెడ్డి. తనను తాకరాని చోట్లలో లారెన్స్ తాకాడని.. ఇక్కడంతా పెద్ద మనిషి ముసుగు వేసుకుని చాలా మంది చిల్లర పనులు చేస్తున్నారని చెప్పింది ఈ ముద్దుగుమ్మ.