మహేష్ కెరియర్ లో మైల్ స్టోన్ మూవీగా నిర్మిమింపబడుతున్న ‘మహర్షి’ మూవీకి సంబంధించి ఒక ఆసక్తికర విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. ఈమూవీ పై చాల కాలం క్రితం షారూక్ ఖాన్ నటించిన ‘స్వదేశ్’ మూవీ కథ ఛాయలు ఉంటాయని దర్శకుడు వంశీ పైడి పల్లి ‘స్వదేశ్’ మూవీ కథకు మార్పులు చేర్పులు చేసి ‘మహర్షి’ గా మారుస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. 

ఈసినిమాలో మహేష్ వివిధ రకాలు అయిన గెటప్స్ లో కనిపించినట్లుగానే షారూక్ ‘స్వదేశ్’ మూవీలో కూడ కనిపించాడు. అయితే ఈకథకు మన పురాణాలకు సంబంధించిన కృష్ణుడు కుచేలుడు కథను ప్రాతిపదికగా తీసుకుని వంశీ పైడి పల్లి ‘మహర్షి’ క్యారెక్టర్ ను డిజైన్ చేసినట్లు టాక్. 

ఈమూవీ కథ గురించిన విషయాలు అలా ఉంచితే వచ్చే ఏడాది ఏప్రియల్ లో ఉగాది పండుగ రోజున విడుదల కాబోతున్న ఈమూవీకి ఇప్పటి నుంచే జరుగుతున్న ప్రీ రిలీజ్ బిజినెస్ ను చూసి ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపోతున్నారు. ఇది ఇలా ఉండగా ఈమూవీ శాటిలైట్ రైట్స్ ను అత్యంత భారీ పోటీ మధ్య జెమిని ఛానల్ 26.5 కోట్లకు తీసుకోవడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. 

ఇప్పటికే ఈసినిమాకు సంబంధించిన టీజర్ కు విపరీతమైన స్పందన రావడంతో మహేష్ కెరియర్ లో 25వ సినిమాగా రాబోతున్న ఈమూవీ పై భారీ అంచనాలు ఇప్పటి నుంచే పెరిగిపోతున్నాయి.  టాప్ యంగ్ హీరోల మూవీ కలక్షన్స్ మధ్య విపరీతమైన పోటీ ఏర్పడిన నేపధ్యంలో ఈమూవీ విజయం గురించి దర్శకుడు వంశీ పైడిపల్లి పై విపరీతమైన ఒత్తిడి పెరుగుతున్నట్లు సమాచారం..



మరింత సమాచారం తెలుసుకోండి: