తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి మెప్పించారు. ఓ వైపు చిత్రాల్లో నటిస్తూనే మరోవైవు యాడ్స్ లో నటిస్తున్నాడు.  ప్రస్తుతం వంశి పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ చిత్రంలో నటిస్తున్నాడు.  ఈ చిత్రంలో కీలక పాత్రలో అల్లరి నరేష్ కనిపిస్తున్నాడు..హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుంది. అమెరికాలోని ఈ చిత్రం చిత్రీకరణ జరగుతోంది. నవంబర్‌ ఆరున ఈ హీరో అమెరికా నుంచి తిరిగి రానున్నారు.

ఈ మద్య స్టార్ హీరోలు ఇండస్ట్రీలో కొనసాగుతూనే బిజినెస్ రంగంలోకి దిగుతున్నారు.  ఇప్పటికే రాంచరణ్ కొన్ని వ్యాపార సంస్థలకు అధినేతగా ఉంటున్నారు.  ఎన్టీఆర్ కూడా ఆ మద్య బిజినెస్ రంగంలోకి దిగుతున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా మహేష్ బాబు కూడా బిజినెస్ మాన్ గా మారుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో భారీ సంఖ్యలో మల్టీప్లెక్స్‌లు నిర్మాణానికి సన్నాహాలు చేయనున్నారు. మొదటి మల్టీప్లెక్స్‌ వెంచర్‌ను హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో నవంబర్‌ ఎనిమిదో తేదీన మహేశ్‌ ఆవిష్కరించనున్నారు. అంతే కాదు ఇందులో 'థగ్స్‌ ఆఫ్‌ హిందుస్తాన్‌' చిత్రాన్ని ఈ థియేటర్‌లో తొలిసారిగా ప్రదర్శించనున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: