తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని నాగేశ్వరరావు తనయుడు అక్కినేని నాగార్జున్ విక్రమ్ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత కొన్ని యాక్షన్ తరహా చిత్రాల్లో నటించిన నాగార్జునకు ‘శివ’చిత్రంతో మాస్ ఇమేజ్ బాగా వచ్చింది. ఇక మన్మధుడు చిత్రంతో యువతులకు కలల రాకుమారుడుగా పేరు తెచ్చుకున్నాడు. ఇండస్ట్రీలో కింగ్ నాగార్జున అని పిలుచుకుంటున్నారు. ప్రస్తుతం నాగార్జున తనయులు నాగ చైతన్య, అఖిల్ లు హీరోలుగా రాణిస్తున్నారు. ఇప్పటికే ‘జోష్’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగ చైతన్య తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు.
‘అఖిల్’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ తర్వాత ‘హలో’చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్నాడు. తాజాగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘మిస్టర్ మజ్ను’ చిత్రంలో నటిస్తున్నాడు. ‘తొలిప్రేమ’తో తొలి హిట్ ను అందుకున్న వెంకీ అట్లూరి ఈ చిత్రంలో అఖిల్ ని మరో మన్మధుడిగా చూపించబోతున్నారట. తాజాగా ఈ చిత్రం గురించి నిర్మాత బీవీఎస్ ఎన్ ప్రసాద్ మాట్లాడారు.
కథా పరంగా ఈ చిత్రంలో ఎక్కువ భాగాన్ని 'లండన్' లో చిత్రీకరించాం. రెండు పాటలు .. రెండు ఫైట్లు మినహా ఈ చిత్రం చిత్రీకరణ పూర్తయింది. తమన్ సంగీతం యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది .. ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ఈ సినిమా బాగా ఆకట్టుకుంటుంది" అని చెప్పుకొచ్చారు. రెండు పాటలను .. ఫైట్లను త్వరలోనే పూర్తిచేయనున్నాం. ఆ తరువాత విడుదల తేదీని ప్రకటిస్తామని చెప్పారు.