అఖిల్ ముచ్చటగా మూడవసారి మూడవ ప్రయత్నంగా నటిస్తున్న ‘మిస్టర్ మజ్ను’ హిట్ కాకుంటే ఇక అఖిల్ కెరియర్ ముగిసిపోయినట్లే అని వస్తున్న కామెంట్స్ నాగార్జునకు తీవ్ర కలవర పాటుకు గురి చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఈమూవీ ఎడిటింగ్ విషయంలో నాగార్జున కనపరుస్తున్న శ్రద్ద ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది.
చరణ్ సినిమాల గురించి చిరంజీవి గతంలో చూపించిన శ్రద్ధకు మించి నాగార్జున టెన్షన్ పడుతూ ఇప్పటికే ఇంచుమించు షూటింగ్ పూర్తి చేసుకున్న ‘మిస్టర్ మజ్ను’ ఫైనల్ అవుట్ పుట్ పై తీవ్ర గందరగోళంలో ఉన్నట్లు సమాచారం. ఈసినిమాకు దర్శకత్వం వహిస్తున్న వెంకీ అట్లూరి ఈసినిమా నిడివి విషయంలో అనుసరిస్తున్న వ్యూహాలు నాగార్జునకు ఏమాత్రం రుచించడం లేదు అని టాక్.
దీనితో ఈసినిమాకు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న నవీన్ నూలి పై నాగ్ తీవ్ర ఒత్తిడి ఉంది అని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈసినిమా టేకింగ్ విషయంలో నాగార్జునకు కొంతమేర అసంతృప్తి ఉన్న నేపధ్యంలో ఈమూవీ నిడివి ఎట్టి పరిస్తుతులలోను పెద్దదిగా ఉండకూడదని ఎడిటర్ నవీన్ కు నాగ్ గట్టి సూచనలు ఇచ్చినట్లు సమాచారం. అయితే జరుగుతున్న విషయాలు వెంకీ అట్లూరికి నచ్చకపోయినా నాగార్జునతో రాజీ పడుతున్నాడని ఇండస్ట్రీ వర్గాలలో గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి.
వాస్తవానికి ఈసినిమాను ఈ ఏడాది డిసెంబర్ లో కానీ లేదంటే వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ కు కానీ విడుదల చేయాలి అని నాగార్జున భావించినా విపరీతమైన సినిమాల విడుదల పోటీ వల్ల అఖిల్ కు ఫిబ్రవరిలో వచ్చే వేలెంటైన్స్ డే వరకు డేట్ దొరకలేదు. దీనితో రకరకాల సమస్యల మధ్య నలిగిపోతున్న ‘మిస్టర్ మజ్ను’ ఫలితం గురించి మాత్రమే కాకుండా ఆసినిమా నిడివి గురించి కూడ నాగార్జున టెన్షన్ పడటం షాకింగ్ గా మారింది..