ప్రపంచంలోనే అత్యుత్తమ 100 విదేశీ చిత్రాల్లో మన భారతీయ చిత్రానికి
చోటుదక్కింది. టాప్ 15లోనే మన సినిమాకు స్థానం లభించడం విశేషం. ఆచిత్రమే " పథేర్ పాంచాలి" అకీరా కురోసావా ఈ చిత్రాన్ని 1954లో తెరకెక్కించారు. అలనాటి దర్శకుడు
సత్యజిత్ రే దర్శకత్వం వహించారు. 1955 లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇంగ్లీష్ మీడియా ఛానెల్ బీబీసీ టాప్ 100 ఉత్తమ విదేశీ చిత్రాల జాబితాను మొన్న గురువారం విడుదల చేసింది. 43 దేశాలకు చెందిన 209 సినీ విమర్శకుల చేత ఎన్నిక నిర్వహించిన అనంతరం ఈ జాబితాను విడుదల చేసింది. పథేర్ పాంచాలి చిత్రాన్ని నిర్మించేందుకు నాడు పశ్చిమ్ బంగా ప్రభుత్వం సాయపడింది. ప్రముఖ రచయిత బీభూతిభూషణ్ బందోపాధ్యాయ 1929 లో రాసిన బెంగాలీ నవల పథేర్ పాంచాలి ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
ఈ చిత్రంతోనే సత్యజిత్ రే దర్శకుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. ఓ గ్రామానికి చెందిన పేద కుటుంబం ఎలాంటి అవాంతరాలను ఎదుర్కొంది? అన్న నేపథ్యంలో ఈ సినిమాను తీశారు. ఈ చిత్రాన్ని నిర్మించడానికి ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో మూడేళ్లు వాయిదాపడింది. సత్యజిత్ రే ఈ సినిమాను తీయాలను కుంటున్నారని తెలిసి, కథ నచ్చి పశ్చిమ్ బంగా ప్రభుత్వం నగదు ఇచ్చింది.
ఇదే ఈ జాబితాలో మొదటి చిత్రంగా జపనీస్ చిత్రం 'సెవెన్ సమురారు' ను యావత్ ప్రపంచం మెచ్చుకుంది. ఇతర దేశాలకు చెందిన సినీ విమర్శకులు సైతం ఈ చిత్రాన్ని ప్రశంసించారు. కానీ సొంత దేశం నుంచి మాత్రం ఈ సినిమాకు విముఖత ఎదురైంది. జపాన్కు చెందిన ఆరుగురు సినీ విమర్శకులు ఓటు వేసిన చిత్రాల్లో అకీరా కురోసావా దర్శకత్వం వహించిన సినిమా ఒక్కటి కూడా లేదు. అలాంటి చిత్రమే టాప్ 100 ఉత్తమ చిత్రాల్లో మొదటి స్థానంలో చోటుదక్కించుకోవడం విశేషం.
టాప్ 100 పాపులర్ విదేశీ చిత్రాల్లో 27 ఫ్రెంచ్ చిత్రాలు, 12 మాండరిన్, 11 ఇటాలియన్, జపనీస్ చిత్రాలు ఉన్నాయి. ఈ టాప్ 100 చిత్రాల్లో నాలుగు చిత్రాలు మాత్రమే మహిళలు తెరకెక్కించినవి ఉన్నాయి. ఉత్తమ చిత్రాల పోలింగ్లో పాల్గొన్న సినీ విమర్శకుల్లో 45 శాతం మహిళలే కావడం గమనార్హం.