‘జనసేన’ అధినేత పవన్‌ కల్యాణ్ మొన్న కొనసాగించిన రైలు యాత్రలో ప్రవర్తించిన తీరు పై కొందరు వేస్తున్న సెటైర్లు పవన్ వీరాభిమానులకు తీవ్ర అసహనాన్ని కలిగిస్తున్నాయి. పవన్ తన రైలు యాత్రలో భాగంగా విజయవాడ నుండి తుని వరకు జన్మభూమి  ఎక్స్ ప్రెస్ లో ప్రయాణిస్తూ తన తోటి ప్రయాణీకుల కష్టాలు తెలుసుకుంటూ చాలమందికి వారి కోరిక మీరకు సెల్ఫీలకు పోజులు ఇస్తూ చాలా సేపు హడావిడి చేసిన తరువాత పవన్ చిన్న పిల్లవాడులా మారిపోయి చేసిన ఒక విచిత్రమైన సంఘటన అందర్నీ ఆశ్చర్య పరిచింది.  
PHOTOS: Janasena Chief Pawan Kalyan Train Journey From Vijayawada To Tuni
రైలు కొంతదూరం వెళ్లాక పవన్ తన సీటు వదిలి డోర్ వద్దకు వచ్చేశాడు. అంతేకాదు ఆ ట్రైన్ కంపార్ట్ మెంట్ డోర్ దగ్గర కూర్చుని తన పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నాడు. ఆసమయంలో చిన్ననాటి విశేషాలను గుర్తుకు తెచ్చుకున్నాడు. 
PHOTOS: Janasena Chief Pawan Kalyan Train Journey From Vijayawada To Tuni
ఇదే సందర్భంలో కొబ్బరిబొండంతో పవన్ దిగిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఇది అంతా బాగానే ఉన్నా డోర్ వద్ద కూర్చుని ప్రయాణం చేయడం ప్రమాదకరం చట్ట విరుద్ధమని రైలులో బోర్డులు ఉన్నా అవేమి పట్టించుకోకుండా ఇలా పవన్ రైలుబోగి డోర్ దగ్గర కూర్చుని ప్రయాణం చేయడం ఏమిటి అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. 
PHOTOS: Janasena Chief Pawan Kalyan Train Journey From Vijayawada To Tuni
అదీ కాకుండా ఈవిషయానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్న నేపధ్యంలో ఈఫోతోలు ఆధారంగా రైల్వే అధికారులు కేసు పెడితే కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుందని ‘జనసేన’ సైనికులు టెన్షన్ పడుతున్నారట. ఈవిషయంలో రూల్స్ అధిగమించినవాళ్లకు రైల్వేస్ యాక్ట్ సెక్షన్ 156 ప్రకారం మూడునెలల జైలు లేదా 500 రూపాయల జరిమానా విధించే అవకాశము ఉంది కాబట్టి ఈవిషయాలు సెలెబ్రెటీ స్థాయికి ఎదిగిన పవన్ కళ్యాణ్ కు తెలియవా అంటూ కొందరు చేస్తున్న కామెంట్స్ పవన్ వీరాభిమానులకు తీవ్ర ఆవేదన గురిచేస్తున్నట్లు టాక్..


మరింత సమాచారం తెలుసుకోండి: