బాలీవుడ్ లో ఇప్పుడు ఖాన్ త్రయం సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, షారూఖ్ ఖాన్ ల జోరు కొనసాగుతుంది. ఇప్పటికే వీరు నటించిన చిత్రాలు బాలీవుడ్ లో దుమ్మురేపుతున్నాయి. ప్రస్తుతం అమీర్ ఖాన్, అమితాబచ్చన్ కాంబినేషన్ లో వస్తున్న ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’రిలీజ్ కి సిద్దంగా ఉంది. మరోవైపు షారూఖ్ ఖాన్ నటించిన ‘జీరో’ చిత్రం కూడా త్వరలో రిలీజ్ కాబోతుంది..ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ షారూఖ్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేశారు. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ చిత్రాలకు కొదవలేదు.
స్టార్ హీరోలు కలిసి నటించిన చిత్రాలు సూపర్ హిట్ గా నిలిచాయి. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్ కాంబినేషన్ అంటే ఫ్యాన్స్ కి విపరీతమైన క్రేజ్ ఉంటుంది. గతంలో వీరిద్దరు కలిసిన నటించిన చిత్రాలు కరణ్అర్జున్, హమ్ తుమ్హారే హై సనమ్ మంచి విజయాలు అందుకున్నాయి. ఆ తర్వాత వీరిద్దరూ కలిసిన నటించకపోయినా..ఒకరి చిత్రంలో మరొకరు అతిధి పాత్రల్లో నటించారు.
దాదాపు పదహారేళ్ల విరామం తర్వాత కథానాయకులుగా పూర్తిస్థాయి పాత్రల్లో వీరిద్దరూ ఓ సినిమా చేయబోతున్నట్లు తెలిసింది. ఈ చిత్రం ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కబోతుందట..ప్రముఖ దర్శకులు దాదాపు పదహారేళ్ల విరామం తర్వాత కథానాయకులుగా పూర్తిస్థాయి పాత్రల్లో వీరిద్దరూ ఓ సినిమా చేయబోతున్నట్లు తెలిసింది.