ఈ సంవత్సరం సుకుమార్ దర్శకత్వంలో రాంచరణ్, సమంత జంటగా నటించిన ‘రంగస్థలం’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రామ్ చరణ్.. బోయపాటి డైరెక్షన్లో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ప్రారంభం అయి చాలా రోజులు అవుతున్నా..ఇప్పటి వరకు ఒక్క అప్ డేట్ కూడా రాకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ పడుతున్న సమయంలో కొద్ది సేపటి క్రితం దీపావళి కానుకగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. యాక్షన్ ఎంటర్టైనర్ గా నిర్మితమవుతోన్న ఈ చిత్రంలో చరణ్ సరసన కథానాయికగా కైరా అద్వాని కనిపించనుంది.
ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. బోయపాటి అంటే మాస్ యాక్షన్కి కేరాఫ్ అడ్రస్.. ఆయన మార్క్ కనిపించే విధంగా రామ్ చరణ్ను మెగా మాస్ లుక్లో చూపించారు. చిట్టిబాబుని పూర్తి స్థాయిలో చేంజ్ చేసి తనదైన శైలిలో కత్తి పట్టించి, ఒంటి నిండా మట్టితో వర్షంలో పరుగు పెట్టిస్తున్నారు. చరణ్ లుక్ ఆయన అభిమానులను ఖుషీ చేస్తుందనే చెప్పాలి. ఈ చిత్రం నుంచి ఈ నెల 9వ తేదీన ఉదయం 10:25 గంటలకు టీజర్ ను వదలనున్నారు.
టైటిల్లో వినయం ఉన్నప్పటికీ రామ్ చరణ్లో వీరత్వం కనిపిస్తుంది. డి.వీ.వీ.ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో దానయ్య డి.వి.వి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ప్రతి నాయకుడిగా నటిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి ‘వినయ విధేయ రామ’ థియేటర్స్లో వీరత్వాన్ని ప్రదర్శించనున్నాడు. ఈ చిత్రంలో ప్రశాంత్, స్నేహ కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు. సంక్రాంతికి ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తారు.