తెలుగు ఇండస్ట్రీలో త్రివిక్రమ్ శ్రీనివాస్ - పవన్ కళ్యాన్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రాల్లో ‘అత్తారింటికి దారేది’బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది. అప్పట్లో ఈ చిత్రానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో లీక్ అయినా..రిలీజ్ అయిన తర్వాత కలెక్షన్ల పరంగా దుమ్మురేపింది. సెంటిమెంట్, కామెడీ, ఎమోషన్స్తో కూడిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. పవన్ సరసన సమంత .. ప్రణీత కథానాయికలుగా నటించారు. ఈ చిత్రాన్ని కన్నడంలో ఈగ ఫేమ్ కిచ్చ సుదీప్ హీరోగా నటించారు. నదియా పాత్రలో బాలీవుడ్ నటి మధుబాల నటించింది.
తాజాగా ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తున్నారు. స్టార్ డైరెక్టర్ సుందర్.సి దర్శకత్వంలో తమిళ రీమేక్ తెరకెక్కుతుండగా, పవన్ పాత్రని శింబు చేస్తున్నాడు. తొలిసారి సుందర్- శింబు జతకట్టడంతో ఈ ప్రాజెక్ట్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీపావళి సందర్భంగా చిత్ర ఫస్ట్ లుక్తో పాటు టైటిల్ రివీల్ చేసింది చిత్ర బృందం. 'వంతరాజ వతన్ వరువేన్' అనే టైటిల్ని చిత్రానికి ఫిక్స్ చేయగా, ఇందులో శింబు చాలా స్టైలిష్గా ఉన్నాడు.
తెలుగు వర్షెన్లో నదియా పోషించిన ‘సునంద’(అత్త) పాత్రని తమిళంలో కుష్బూ పోషిస్తున్నారని సోషల్మీడియాలో పుకార్లు షికారు చేశాయి. దీనిపై క్లారిటీ రావలసి ఉంది. హిప్ హాప్ తమీజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తుంది. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేస్తున్నారు. తెలుగులో పవన్ తాత( బొమన్ ఇరానీ) పాత్రని తమిళంలో ఎవరు పోషించనున్నారు తదితర అంశాలపై క్లారిటీ రావలసి ఉంది.