రవితేజ నటించిన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ విజయం మాస్ మహారాజ కెరియర్ కు అత్యంత కీలకంగా మారడంతో ఈమూవీని చాల పెద్దఎత్తున మాస్ మహారాజ ప్రమోట్ చేస్తున్నాడు. ఇప్పటికే అనేక ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తున్న రవితేజ ఈరోజు జరగబోతున్న ఈమూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా ఘనంగా నిర్వహించే ఏర్పాట్లు ఈమూవీ నిర్మాతలు అయిన మైత్రి మూవీస్ ద్వారా చేయిస్తున్నాడు. 

ఈపరిస్థితి ఇలా కొనసాగుతూ ఉంటే రవితేజాకు  హీరోయిన్ ఇలియానా పై కోపం వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. గతంలో ఇలియానా క్రేజీ హీరోయిన్ గా కొనసాగే రోజులలో కూడ ఇలియానా తాను నటించే సినిమాల షూటింగ్స్ మినహా ప్రమోషన్ కార్యక్రమాలకు వచ్చేది కాదు. అలా తాను  నటించే మూవీ ప్రమోషన్ కార్యక్రమాలకు ఆమె రావాలి అంటే ఇలియానాకు ఎక్స్ ట్రా అమౌంట్ కూడా ముట్టచెప్పాలి అన్న వార్తలు ఉన్నాయి.

అయితే ప్రస్తుతం ఇలియానా హవా పూర్తిగా అయిపోయినా అమెను పిలిచి రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ లో అవకాశం ఇవ్వడమే కాకుండా ఆమెకు కోటి రూపాయలకు పైగా పారితోషికం వచ్చేలా రవితేజ సహకరించాడు అయినా ఇలియానా ఏమాత్రం మారకుండా తన పాత స్వభావాన్ని మరోసారి చూపిస్తోందిఅని ఫిలింనగర్ టాక్. ఇప్పటిదాకా ఈ సినిమా టీమ్ అంతా టీవీలకు ఇంటర్వ్యూలు ఇచ్చేసింది కానీ ఇలియానా కనిపించడం లేదు అని టాక్. దీనితో మరోసారి ఇల్లి బేబీ ప్రవర్తన వివదాస్పదంగా మారింది. 

‘అమర్ అక్బర్ ఆంటో’ నీ సినిమాకు సంబంధించి ఈరోజు ప్రీ-రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఇప్పటివరకు ఏప్రచార కార్యక్రమానికి హాజరుకాని ఇలియానా కనీసం ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్ కైనా వస్తే బాగుంటుందనీ హీరో రవితేజ దర్శకుడు శ్రీనువైట్ల అనేక సార్లు ఆమెకు మెసేజ్ లు పంపుతూ ఉన్న ఆమె స్పందించడం లేదు అని సమాచారం. ఈ సినిమా నిర్మాతలు కూడా ఇలియానా వస్తేనే ఈవెంట్ కి అదనపు క్రేజ్ ఉంటుందని అంచనావేస్తున్న నేపధ్యంలో ఆమెకు అదనపు పారితోషికం ఇచ్చి అయినా ఈరోజు జరగాబోయే ఈమూవీ ఫంక్షన్ కు రప్పించాలని ప్రయత్నిస్తున్న నేపధ్యంలో ఇలియానా వీరందరినీ ఎంతవరకు కరుణిస్తుందో చూడాలి..   


మరింత సమాచారం తెలుసుకోండి: