తెలుగులో ఒకే ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారిపోయిన ఇలియాన ఆతరువాత అతి తక్కువ కాలంలో అందరి టాప్ హీరోలతో నటించి టాప్ హీరోయిన్ గా మారిపోయింది. అయితే అప్పట్లో ఆమెకు అవకాశాలు బాగా వస్తూ ఉండగానే ఆమె ఉన్నట్లుండి బాలీవుడ్ కు వెళ్లిపోపోవడం అప్పట్లో హాట్ టాపిక్.
అలా టాలీవుడ్ కు దూరం అయిన ఇలియానా ఆరేళ్ల పాటు పూర్తిగా బాలీవుడ్ కే అంకితం అయిపోయింది. అయితే అప్పట్లో బాలీవుడ్ కు వెళ్ళడం వెనుక తన నిర్ణయం పై త్రివిక్రమ్ సలహాలు బాగా ప్రభావితం చేశాయని ఇలియానా చెపుతోంది. ఈవారం విడుదల కాబోతున్న ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ ప్రమోషన్లలో ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలియానా ఈఆసక్తికర విషయాలనువివరించింది.
అప్పట్లో తెలుగులో ‘జులాయి’ సినిమా చేస్తున్నప్పుడు ‘బర్ఫీ’ లో నటించే అవకాసం వచ్చిన విషయాన్ని గుర్తుకు చేసుకుంటూ ఈవిషయమై కన్ఫ్యూజన్ లో ఉన్న తాను త్రివిక్రమ్ ను సలహా అడిగితే అడిగితే అలాంటి అవకాశం వదులుకో వద్దు అంటూ ప్రోత్సహించిన విషయాన్ని బయటపెట్టింది. ‘బర్ఫీ’ లాంటి మంచి కథతో కూడిన సినిమా కావడంతో ఆసినిమా కోసం తాను బాలీవుడ్ కు వెళితే ఆ తరువాత తనకు వరసగా బాలీవుడ్ లో ఛాన్సులు రావడంతో తాను తెలుగు పరిశ్రమకు దూరం అయిన విషయాన్ని బయటపెట్టింది ఇల్లి బేబీ.
అయితే ఆతరువాత కొందరు తన పై రూమర్స్ సృష్టించి తనకు తెలుగు సినిమాలలో నటించే ఉద్దేశ్యం లేదంటూ పుకార్లు పుట్టించడంతో తనకు తెలుగు సినిమాలలో గ్యాప్ వచ్చిన విషయాన్ని ఇప్పుడు ఆలస్యంగా బయట పెట్టింది ఈ గోవా బ్యూటీ. అయితే ఇలియానాకు బాలీవుడ్ లో అవకాశాలు వచ్చినా ఆ ఆఫర్స్ ఆమెకు తెలుగు సినిమాలు ఇచ్చినంత క్రేజ్ ను కలిగించ లేకపోయాయి. దీనితో త్రివిక్రమ్ సలహాతో ఇలియానాకు అనుకోని కస్టాలు వచ్చాయి అనుకోవాలి. ప్రస్తుతం సీనియర్ హీరోలకు వారి సినిమాలకు సంబంధించి హీరోయిన్ కష్టాలు ఎక్కువ అవుతున్న నేపధ్యంలో ‘అమర్ అక్బర్ ఆంటో’ ని ఆమెకు ఎలాంటి అదృష్టాన్ని ఇస్తుందో చూడాలి..