తెలుగు ఇండస్ట్రీలో ఈ సంవత్సరం ప్రముఖ దర్శకులు కొరటాల శివ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అంతే కాదు మహేష్ కెరీర్ లో రెండు వందల కోట్ల క్లబ్ లో చేరిన చిత్రంగా నిలిచింది. తాజాగా వంశి పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ చిత్రంలో నటిస్తున్నాడు మహేష్ బాబు.
అశ్వనీదత్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా యూఎస్ షెడ్యూల్ను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ చిత్రానికి సంబంధించి హైదరాబాద్లో భారీ విలేజ్ సెట్ను నిర్మించారు.ఈ సెట్లో షూటింగ్ కూడా ప్రారంభమైనట్టు సమాచారం.
ఈ చిత్రం శాటిలైట్ హక్కుల విషయంలో భారీ డీల్ కుదిరిందరని ఫిలింనగర్ టాక్. ‘మహర్షి’ హిందీ శాటిలైట్ హక్కులకు దిల్ రాజు రూ.25 కోట్లకు అమ్మేందుకు సిద్ధపడ్డారట. అంతే కాదు ఒక సంస్థ రూ.20 కోట్లు చెల్లించేందుకు సిద్ధమవడంతో ఆయన ఆ డీల్ ను ఓకే చేసినట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో నరేష్ ఓ ముఖ్యపాత్రలో కనిపిస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదలకు సిద్ధమవుతోంది.