తమిళనాట సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే ఎంత క్రేజ్ ఉంటుందో అందరికీ తెలిసిందే.  జయాపజయాలతో సంబంధం లేకుండా రజినీకాంత్ చిత్రం వస్తుందంటే చాలు ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతారు.  రజినీ చిత్రాలు రిలీజ్ కి వారం ముందు నుంచే థియేటర్ల వద్ద నానా హంగామా చేస్తుంటారు. పెద్ద పెద్ద కటౌట్లు, పాలాభిషేకాలు, స్వీట్లు పంచుతూ సంబరాలు చేసుకుంటారు.  అప్పట్లో స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ‘రోబో’ఇండియన్ హిస్టరీలోనే ఓ చరిత్ర సృష్టించింది. 
Image result for ‘2.0’ ట్రైలర్
ఆ చిత్రం తర్వాత రజినీకాంత్ కి సరైన హిట్స్ రాలేదు..కానీ ఆయన క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు.  ప్రస్తుతం శంకర్, రజనీకాంత్  కాంబినేషన్ లో ‘2.ఒ’ చిత్రం రాబోతుంది.  లైకా ప్రొడక్షన్స్ సుభాష్ కరణ్ నిర్మిస్తున్న భారీ చిత్రం ‘2.0’. సుమారు రూ. 550 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు.  ఈ చిత్రం తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రాబోతుంది.  కాగా, ఈ చిత్రం ట్రైలర్ దీపావళి కానుకగా నవంబర్ 3న గ్రాండ్‌గా విడుదల చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కేవలం పది రోజుల్లోనే 140 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి రికార్డు సృష్టించింది ‘2.0’ ట్రైలర్.
Image result for ‘2.0’ ట్రైలర్
టీజర్, ట్రైలర్ కలిపి మొత్తం 14 కోట్ల వ్యూస్ అధిగమించి మరిన్ని రికార్డుల దిశగా దూసుకెళ్తోంది.  చెన్నైలోని స‌త్యం సినిమాస్‌లో 4డీ సౌండ్‌ టెక్నాలజీతో విడుదల చేసిన ట్రైలర్  వ్యూస్ చూస్తుంటే..మరో సంచలన విజయం సాధిస్తుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. సూపర్‌స్టార్ రజనీ సరసన మోడల్, నటి ఎమీ జాక్సన్ హీరోయిన్‌గా నటించింది.
Related image
బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్‌కుమార్ విలన్ పాత్ర లో కనిపిస్తున్నారు.  ఆస్కార్ విజేత ఏఆర్‌ రెహమాన్‌ స్వరాలు సమకూర్చారు. నిరవ్‌షా సినిమాటోగ్రఫీ అందించగా, ఎడిటింగ్ బాధ్యతలు ఆంటోని నిర్వర్తించారు. లైకా ప్రొడక్షన్స్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రాన్ని నవంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: