మోడల్ గా ముంబై నగరాన్ని షేక్ చేసిన కియరా అద్వానీ ఆతరువాత బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా అక్కడ ఆమెకు వచ్చిన క్రేజ్ కంటే ప్రస్తుతం ఆమెకు టాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్న క్రేజ్ చాలా ఎక్కువగా ఉంది.   వాస్తవానికి ఈ బ్యూటీ  ‘భరత్ అనే నేను’ చిత్రంతో  టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా   ఆ సినిమాలోని ఆమె పాత్ర స్వభావ రీత్యా ఆమె పై ఎక్కువగా రొమాన్స్ సీన్స్  లేవు. దీనివల్ల తన ఎక్స్ పోజింగ్ ట్యాలెంట్ ని పూర్తిగా ఆవిష్కరించే అవకాశం ఈమెకు రాలేదు. 

అయితే ప్రస్తుతం ఈమె రామ్ చరణ్ సరసన నటిస్తున్న ‘వినయ విధేయ రామా’ చిత్రంలో ఈమెతో చరణ్ కు చాలా ఘాటైన రొమాంటిక్ సీన్స్ ఉన్నట్లు సమాచారం. వాస్తవానికి ఈ మూవీ బోయపాటి శైలిలోని మాస్ మసాలా యాక్షన్ సినిమాగా తయారు అవుతున్నా ఇందులో కియరా రోల్ అంతే రంజుగా తీర్చిదిద్దారని తెలుస్తోంది.  బోయపాటి అన్ని సినిమాల్లో ఉన్నట్టే ఈ సినిమాలోనూ మాస్ ఎలిమెంట్స్ కి మాస్ సాంగ్స్ కి కొదవలేదని వార్తలు వస్తున్నాయి.  

 ప్రస్తుతం చరణ్ కియరా పై ఓభారీ మాస్ సాంగ్ ని తెరకెక్కిస్తున్నారు. ఇందుకోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో ఒక భారీ సెట్ ని నిర్మించారు. ఈ స్పెషల్ మాస్ సాంగ్ కోసం దేవీశ్రీ అద్భుతమైన ట్యూన్ ని ఇచ్చాడట. బోయపాటి ఇన్ స్ట్రక్షన్స్ తో కొరియోగ్రాఫర్లు చెర్రీ బాడీ లాంగ్వేజ్  కియరాఎక్స్ పోజింగ్ ని దృష్టిలో పెట్టుకుని బోలెడంత గమ్మత్తైన స్టెప్పులు క్రియేట్ చేస్తున్నాని టాక్. ఈ వారాంతం నాటికి ఈసెట్ లో పాట చిత్రీకరణ పూర్తి కానుంది అని తెలుస్తోంది. ఈపాటలో కియరా తన సహజ సిద్ధమైన ఎక్స్ పోజింగ్ తో పాటు ఆమె చరణ్ స్పీడ్ కు మించి వేగంగా వేసిన స్టెప్స్ చరణ్ ను ఖంగారు  పెట్టించినట్లు సమాచారం. 

ఇది ఇలా ఉండగా ఈమెకు మరికొన్ని ఆఫర్లు కూడా ఈమె తలుపు తడుతున్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి.  అల్లుఅర్జున్  త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో రూపొందబోతున్న చిత్రంలో హీరోయిన్ గా కైరా అద్వానీ ఎంపిక అయ్యిందని కాస్త బలంగానే వార్తలు వినిపిస్తున్నాయి. అదే విధంగా మహేష్ బాబు సుకుమార్ ల కాంబినేషన్ లో వచ్చే ఏడాది ప్రారంభం కాబోతున్న సినిమా కోసం కూడా కైరా అద్వానీని సంప్రదించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇది చాలదు అన్నట్లుగా రాజమౌళి తన ‘ఆర్ ఆర్ ఆర్’ కోసం ఈమెను సంప్రదిస్తున్నట్లు సమాచారం. దీనితో ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రారంభించబోతున్న ప్రతి భారీసినిమాలో ఈమె పేరు వినిపించడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది..
 .


మరింత సమాచారం తెలుసుకోండి: