తెలుగు ఇండస్ట్రీలోకి హీరో నాని నటించిన ‘అలా మొదలైంది’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మళియాళ ముద్దుగుమ్మ నిత్యామీనన్. ఆ తర్వాత పలు తెలుగు చిత్రాల్లోనటించిన నిత్యామీనన్ మొదటి నుంచి గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ వస్తుంది. తెలుగు, తమిళ, మళియాళ భాషల్లో ఇప్పటి వరకు నటించిన నిత్య మొదటి సారిగా బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ తో కలిసి నటిస్తుంది.
ఈ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న నిత్యా మీనన్ ఈ మద్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..వెబ్ సిరీస్ కు కూడా ప్లాన్ చేస్తునట్లు తెలిపింది. వెబ్ సిరీస్ లో తాను ముఖ్యమైన పాత్రలో కనిపిస్తానని చెప్పింది. కాకపోతే ఈ వెబ్ సీరీస్ ఏ భాషలో తీస్తున్నారో అన్న విషయం మాత్రం తెలపలేదు.
కాగా క్రిష్, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో వస్తున్న ‘ఎన్టీఆర్’బయోపిక్ చిత్రంలో సావిత్రి పాత్రలో నటిస్తుంది నిత్యామీనన్. అంతే కాదు తమిళనాట నటిగా, రాజకీయ నాయకురాలిగా అందరి మనసు గెల్చుకొని అమ్మగా పిలుచుకునే మాజీ సీఎం జయలలిత బయోపిక్ లో నిత్యమీనన్ నటించనుంది.