తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జున నట వారుసుడిగా ఎంట్రీ ఇచ్చిన అక్కినేని నాగ చైతన్య వరుసగా చిత్రాలు తీస్తున్న విషయం తెలిసిందే.   ‘ఏం మాయ చేసావే’చిత్రంలో తన సహనటి అయిన సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలసిందే.  ఈ జంట తర్వాత ఆటోనగర్ సూర్య, మనం చిత్రంలో కలిసి నటించారు.  వివాహం అనంతం సమంత నటించిన ‘రంగస్థలం’,‘అభిమన్యుడు’, ‘యూటర్న్’ చిత్రంలో నటించి మంచి విజయం అందుకుది.  తాజాగా ఈ జంట మరోసారి తెరపై కనిపించి మురిపించబోతున్నారు.
Related image
  రీసెంట్ గా సవ్యసాచి చిత్రంతో పాజిటీవ్ టాక్ తెచ్చుకున్న చైతూ, యూటర్న్ చిత్రంతో మంచి విజయం అందుకున్న సమంత కలిసి నటిస్తున్న చిత్రం ‘మజిలి’. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు.  ఇటీవలే ఈ సినిమా వైజాగ్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఇప్పటివరకూ ఈ సినిమాలో సమంత మాత్రమే కథానాయిక అనుకున్నారు.  తాజాగా ఈ చిత్రంలో మరో హీరోయిన్ తీసుకుంటున్నట్లు సమాచారం...ఆమె పేరే 'దివ్యాన్షా కౌశిక్'.


ఈ అమ్మడు కేవలం గెస్ట్ అప్పీరియన్స్ కాదట..చిత్రంలో ఫస్టాఫ్ మొత్తం చైతూ తో రొమాన్స్ చేయబోతుందట. ఈ పాత్ర కోసం ఆడిషన్ జరగగా, సమంతనే ఈ అమ్మాయిని ఎంపిక చేసిందట. ఈ నెల 26వ తేదీ నుంచి మరో షెడ్యూల్ ను మొదలుపెట్టనున్నారు. ఈ షెడ్యూల్లో దివ్యాన్షా కౌశిక్ జాయిన్ కానుందని చెబుతున్నారు.  మరి ఈ  హీరోయిన్ ఏ రేంజ్ లో పర్ఫామెన్స్ చేయబోతుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: