ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో భారత బాక్సర్ మేరీకోమ్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.  వరుసగా ఆరోసారి స్వర్ణ పతకాన్ని సాధించి, ఆ ఘనతను సాధించిన తొలి మహిళా బాక్సర్‌గా చరిత్రకెక్కిన ఆమెను అందరూ అభినందనలతో ముంచెత్తున్నారు. ఢిల్లీలోని కేడీ జాదవ్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో… ఉక్రెయిన్ బాక్సర్ హన్నా ఒకోటాపై మేరీకోమ్ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో, దేశ వ్యాప్తంగా ఆమెపై సర్వత్ర ప్రశంసలు కురుస్తున్నాయి. 48 కిలోల విభాగంలో 5-0తో ఒకోటాను ఖంగుతినిపించింది.

Image result for mary kom

ఈ టోర్నీ ముందు వరకు ఐదు స్వర్ణ పతకాలతో ఐర్లండ్ బాక్సింగ్ దిగ్గజం టేలర్ తో సమానంగా మేరీకోమ్ ఉంది. ఈనాటి స్వర్ణంతో ఆరు స్వర్ణాలు సాధించిన తొలి మహిళగా చరిత్రకెక్కింది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఆమెను ప్రశంసల్లో ముంచెత్తారు. 'అద్భుతమైన విజయం. ఛాంపియన్... నీ విజయాన్ని చూసి గర్విస్తున్నాము.

Image result for mary kom

ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో ఆరు స్వర్ణాలను గెలుపొందినందుకు అభినందనలు.'  ఇక ఆమె ఖాతాలో ఒక సిల్వర్ మెడల్ కూడా ఉండటంతో ప్రపంచ ఛాంపియన్ షిప్ లో ఆమె సాధించిన పతకాల సంఖ్య ఏడు కు చేరుతుంది. 35 ఏళ్ల మేరీకోమ్ రాజ్యసభ సభ్యురాలిగా కూడా ఉన్నారు. ఆమెను భారత రాష్ట్రపతి నామినేట్ చేశారు. ఆమెకు ముగ్గురు కుమారులు ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: