తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడు ధనుష్ హీరోగా తెలుగ, తమిళ, హిందీ ఇండస్ట్రీలో ఎంతో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయిన ధనుష్..తాజాగా ‘మారి2’చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ధనుష్ హీరోగా బాలాజీ తెరకెక్కించిన చిత్రం ‘మారి 2’. 2015లో వచ్చిన మారి సీక్వెల్గా తెరకెక్కిన ఈ చిత్రంలో ధనుష్ సరసన సాయి పల్లవి నటించింది.
కాజల్ అగర్వాల్ కథానాయికగా నటించిన ఈ చిత్రం, మాస్ ఆడియన్స్ కి ఒక రేంజ్ లో కనెక్ట్ అయింది. దాంతో అదే దర్శకుడితో ఈ చిత్రానికి సీక్వెల్ గా 'మారి 2' రూపొందింది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, యు/ఎ సర్టిఫికెట్ ను సొంతం చేసుకుంది. 'మారి 2' డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానున్నది. ధనుష్ సొంత బ్యానర్ పై ఈ చిత్రం నిర్మితమైంది.
'మారి'ని మించిన విజయం 'మారి 2'కి దక్కుతుందని ధనుష్ భావిస్తున్నాడు. ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్ రావడంతో ప్రమోషన్లలో మరింత వేగాన్ని పెంచనుంది చిత్ర యూనిట్. కాగా ఈ చిత్రంలో ధనుష్ గ్యాంగ్స్టర్గా కనిపించనుండగా.. సాయి పల్లవి ఆటో డ్రైవర్గా కనిపించనుంది. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు.