భారత దేశంలో రోజు రోజుకీ ప్రమాదాల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో రద్దీగా ఉన్న జనావాసాల్లో ముఖ్యమైన ప్రదేశాల్లో డ్రంకెన్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తు మందు బాబుల భరతం పడుతున్నారు. ఇలా డ్రంకెన్ డ్రైవ్ లో సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు, ప్రముఖ వ్యాపార వేత్తలు, ప్రభుత్వాధికారులు సైతం పట్టుపడటం గమనార్హం.  తాజాగా ప్రముఖ నటి, నృత్య కళాకారిణి, బిగ్ బాస్ ఫేమ్ గాయత్రీ రఘురామ్ డ్రంకెన్ డ్రైవ్ లో అడ్డంగా బుక్కయింది.
Image result for singer gayathri raghuram drank and drive
ఈ విషయాన్ని పోలీసులు స్పష్టం చేశారు. చెన్నైలోని ఎంఆర్సీ నగర్ లో ఉన్న ఓ స్టార్ హోటల్ లో సినీ సెలబ్రిటీలు పాల్గొన్న ఓ పార్టీకి వెళ్లిన ఆమె, తిరిగి వస్తున్న వేళ, అభిరామపురం ట్రాఫిక్ పోలీసులు, చెక్ పాయింట్ వద్ద పోలీసు తనిఖీలు నిర్వహించారు.  ఈ తనిఖీల్లో  గాయత్రీ రఘురామ్ బ్రీత్ అనలైజర్ లోకి గాలిని ఊదాలని కోరగా, ఆమె తాను ఆల్కహాల్ తీసుకున్నట్టు అంగీకరించింది.

ఆపై పోలీసులు ఆమెకు తనిఖీలు చేసి, మోతాదుకు మించి మద్యం తీసుకున్నట్టు తేల్చి, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. చుట్టూ హడావుడి పెరుగుతూ ఉండటంతో, ఆమెను ఇంటివరకూ దింపాలని నిర్ణయించుకున్నామని, ఆపై ఆమె వాహనం డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. కాగా, మొబైల్ కోర్టులో  రూ. 3,500 జరిమానా చెల్లించి డాక్యుమెంట్లు తీసుకోవచ్చని అన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: