సాధారణంగా ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్ధులలో ఎవరు విజయం సాధిస్తారు లేకుంటే ఏపార్టీ విజయం సాధిస్తుంది అన్న విషయమై భారీగా పందేలు నడుస్తూ ఉంటాయి. సంక్రాంతి కోడి పందాల స్థాయిలో ఇప్పుడు రాజకీయ బెట్టింగ్ లు జరుగుతున్నాయి ఉంటాయి. అయితే దీనికి భిన్నంగా జూనియర్ ఎన్టీఆర్ తన సోదరి నందమూరి సుహాసిని ఎన్నికల ప్రచారానికి వస్తాడా రాడా అన్న విషయమై ప్రస్తుతం భారీ మొత్తాలకు బెట్టింగ్స్ జరుగుతున్నట్లు ఒక మీడియా సంస్థ ఆసక్తికర కథనాన్ని వ్రాసింది.

వాస్తవానికి అతి త్వరలో జరగబోతున్న తెలంగాణ ఎన్నికలకు సంబంధించిన కూకట్ పల్లి నియోజకవర్గ అభ్యర్ధి సుహాసిని ఎన్నికల ప్రచారం కోసం జూనియర్ రాబోతున్నాడు అంటూ చాల ప్రముఖ మీడియా సంస్థలు నిన్న వార్తలను ప్రచురించాయి. అయితే ఈ వార్తలను చూసి జూనియర్ సన్నిహితులు ఆశ్చర్య పోతున్నట్లు సమాచారం. 

దీనికి కారణం ఎన్టీఆర్ వైపు నుండి ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదని ప్రస్తుతం రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి వచ్చే పరిస్థితి జూనియర్ కు లేదని కేవలం ఇది అంతా మీడియా ప్రచారం మాత్రమే అంటూ జూనియర్ అభిమానులు ఈ వార్తలను కొట్టి వేస్తున్నట్లు టాక్. దీనికితోడు ప్రస్తుతం జూనియర్ సినిమాలు అన్నీ వరస విజయాలుగా మారుతున్న నేపధ్యంలో ఇప్పుడు తనంతట తాను రాజకీయ బురద రుద్దు కోవడం జూనియర్ కు ఏమాత్రం ఆసక్తి లేదని జూనియర్ సన్నిహితుల వాదన. 

దీనితో ఎన్నికల ప్రచారం ముగిసే వరకు జూనియర్ తన మనసులో మాట స్పష్టంగా బయటకు చెప్పకుండా రెండు పడవల సిద్ధాంతాన్ని కొనసాగిస్తాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థుతులలో కొందరు రాజకీయ ఉత్సాహ వంతులు అసలు జూనియర్ కూకట్ పల్లి ఎన్నికల ప్రచారానికి వస్తాడా రాడా అంటూ వేసుకుంటున్న భారీ బెట్టింగ్స్ కూడ హాట్ న్యూస్ గా మారుతున్నాయి. అయితే బాలకృష్ణ మాత్రం తన అన్న కూతురు సుహాసిని గెలుపు కోసం త్వరలో ప్రచార రధం ఎక్కబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏమైనా ఒక సెలెబ్రెటీ ప్రచారం గురించి బెట్టింగ్ లు జరగడం జూనియర్ స్టామినాను సూచిస్తోంది..   


మరింత సమాచారం తెలుసుకోండి: