ఒకప్పుడు సంచలన వార్తలకు కామెంట్స్ కు చిరునామాగా ఉండే క్రిష్టియన్ మత బోధకుడు కెఎ. పాల్ మళ్ళీ సంచలన వార్తలకు కేంద్ర బిందువుగా మారాడు. గత కొంతకాలంగా ‘ప్రజాపోరాట’ యాత్ర పేరుతో జనం మధ్య తిరుగుతూ తన ‘జనసేన’ ను ప్రచారం చేస్తున్న పవన్ కు కెఎ. పాల్ ఇచ్చిన లక్ష కోట్ల ఆఫర్ మీడియాకు సంచలన న్యూస్ గా మారింది. 
ప‌వ‌న్ ను వ‌దిలేస్తే న‌ష్టమే..
ఈమధ్య ఒక మీడియా సంస్థతో మాట్లాడిన ఈ మత బోధకుడు తనకు పవన్ కళ్యాణ్ సిద్దాంతాలు నచ్చాయని పవన్ తనను సంప్రదిస్తే తాను పవన్ కు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ సంకేతాలు ఇవ్వడమే కాకుండా తన ‘ప్రజాశాంతి’ పార్టీ సహకారం ‘జనసేన’ కు ఉంటుంది అన్న అభిప్రాయం వ్యక్తం చేసాడు. అంతేకాదు తనకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 2వేల మంది బిలియనీర్స్ తో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పవన్ అంగీకరిస్తే వారందరి దగ్గర నుండి పవన్ ‘జనసేన’ కు లక్ష కోట్ల విరాళాలు సహకరించడం తనకు కష్టం కాదు అంటూ భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నాడు పాల్.
 టిడిపి కోస‌మే ప‌వ‌న్‌..ఇదే ప్ర‌చారాస్త్రం..
అయితే ఈ ఆఫర్లను పట్టించుకోకుండా పవన్ తన ‘జనసేన’ కోసం తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎమ్.జీ. రామచంద్రన్ అనుసరించిన విధానాలను పవన్ తన ‘జనసేన’ కు ఉపయోగించాలని ఆలోచనలు చేస్తున్నట్లు టాక్. గతంలో ఎమ్.జీ.ఆర్ తన ‘అన్నా డిమ్ కే’ పార్టీ కోసం కొన్ని సినిమాలు చేసి ఆ పారితోషికంతో తన పార్టీని ఎవర్ని విరాళాలు అడగకుండా జనం మధ్యకు తీసుకువెళ్ళాడు. 
 అలాంటి నాయకులను తయారు చేసేందుకు 25 ఏళ్లు
ఇప్పుడు అదే పద్ధతిని అనుసరించి తాను సినిమాలు చేసి ఆ పారితోషికంతో ‘జనసేన’ కు ఫండ్స్ ను సమకూరిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలు పవన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు పట్టుమని ఐదు నెలలు కూడ లేని నేపధ్యంలో పవన్ ఎమ్.జీ.ఆర్ ఆలోచనలు వాస్తవ రూపం దాల్చడం చాల కష్టం అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి: