‘2.0’ విడుదలై ఆమూవీకి హిట్ టాక్ రావడంతో ఇక రానున్న రోజులలో టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ దృష్టి అంతా వచ్చే ఏడాది మధ్యలో విడుదల కాబోయే ‘సైరా’ ‘సాహో’ లపై ఉంటుంది. చిరంజీవి ప్రభాస్ ల కెరియర్ కు సంబంధించి అత్యంత భారీ బడ్జెట్ సినిమాలుగా ప్రచారం జరుగుతున్న ఈమూవీలు వీరిద్దరి కెరియర్ కు అత్యంత కీలకం. 

ఇప్పటికే ఈ రెండు సినిమాలకు సంబంధించిన చిత్రీకరణ దాదాపు 70 శాతం వరకు పూర్తి కావడంతో ఈమూవీల రిలీజ్ కోసం అనువైన డేట్స్ ను మెగా కాంపౌండ్ తో పాటు ప్రభాస్ కూడ పరిశీలిస్తున్నాడు. టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ఈ రెండు సినిమాలు అత్యంత భారీ సినిమాలు కావడంతో కనీసం ఈ రెండు సినిమాల మధ్య 45 రోజులు గ్యాప్ ఉండేలా చూసుకోవాలని ఇప్పటికే చిరంజీవి ప్రభాస్ లు ఒక అంగీకారానికి వచ్చినట్లు టాక్. 

దీనితో ఇప్పటి వరకు సమ్మర్ లో ‘సైరా’ విడుదల అవుతుంది వచ్చే ఏడాది ఆగష్టు 15న ‘సాహో’ విడుదల అవుతుంది అంటూ లీకులు వచ్చాయి. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ ఐనట్లు సమాచారం. దీనికి కారణం చిరంజీవి అని అంటున్నారు. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితానికి సంబంధించిన సినిమా కాబట్టి ‘సైరా’ ను వచ్చే సంతర్సం స్వాతంత్రదినోత్సవం రోజున విడుదల చేస్తే అన్నివిధాల బాగుంటుందని చిరంజీవి అభిప్రాయం అని అంటున్నారు. 

దీనితో ‘సాహో’ సమ్మర్ లో విడుదలై ముందుకు వస్తుందా ? లేదా ఏకంగా ఈమూవీ రిలీజ్ ను వచ్చే ఏడాది దసరాకు వాయిదా వేస్తారా అన్న విషయం ఈమూవీకి సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న గ్రాఫిక్ వర్క్స్ పనిపై ఆధారపడి ఉంటుంది అని అంటున్నారు. మరి చిరంజీవి నిర్ణయానికి ప్రభాస్ యాక్షన్ ప్లాన్ ఎలా మారుస్తాడో తెలియాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: