‘నోట్బుక్’ ఫేమ్ రోషన్ ఆండ్రూస్ దర్శకత్వంలో నివిన్ పౌలి నటించిన 'కాయమ్ కులమ్ కొచ్చున్ని' హిట్ టాక్ తెచ్చుకుంది. మలయాళ యువ హీరోలలో నివిన్ పౌలికి ప్రత్యేకమైన స్థానం వుంది. విభిన్నమైన కథలను..విలక్షణమైన పాత్రలను ఎంచుకోవడంలో ఆయన ముందుంటాడు. ఈయన నటించిన 'నేరం'.. 'ప్రేమమ్'.. 'బెంగుళూర్ డేస్' వంటి చిత్రాలు మంచి హిట్ టాక్ తెచ్చుకున్నాయి.
నివిన్ పౌలి హీరోగా నటించిన తాజా చిత్రం 'కాయమ్ కులమ్ కొచ్చున్ని' హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రాన్ని 45 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఒక మామూలు హీరోకి ఈ రేంజ్ లో ఖర్చు చేయడం ఆ మద్య పెద్ద సెన్సేషన్ అయ్యింది. ఇంతవరకూ మలయాళంలో ఈ స్థాయి బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం ఇదే అంటున్నారు.అక్టోబర్ 11వ తేదీన విడుదలైన ఈ చిత్రం నేటితో 50 రోజులను పూర్తి చేసుకుంది. ఇంతవరకూ ఈ చిత్రం 100 కోట్లకు పైగా రాబట్టింది.
19వ శతాబ్దంలో దారి దోపిడీ దొంగగా సెంట్రల్ ట్రావెన్కోర్ ప్రాంతాన్ని గడగడలాడించిన కాయమ్కులమ్ కొచ్చున్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో మోహన్లాల్ కీలక పాత్ర లో నటించారు. నివిన్ పౌలి సరసన ప్రియా ఆనంద్ హీరోయిన్ గా నటించింది. గోపీసుందర్ స్వరాలు సమకూర్చారు. ఈ చిత్రం విజయం సాధించడం..వందకోట్ల క్లబ్ లో చేరడంతో చిత్ర యూనిట్ సంబరాలు చేసుకుంటున్నారు.