తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖ దర్శకులు క్రిష్ జాగర్లమూడికి అరుదైన పురస్కారం దక్కనుంది.   గురజాడ అప్పారావు 103వ వర్థంతి సందర్భంగా క్రిష్ గురజాడ పురస్కారాన్ని అందుకోనున్నారు. మహాకవి గురజాడ 103వ వర్థంతి  సందర్భంగా ప్రతి సంవత్సరం నేడు (నవంబర్ 30)వ తేదీన గురజాడ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో మహాకవి గురజాడ వర్థంతిని నిర్వహిస్తున్నామని, ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు.
Image result for డైరెక్టర్ క్రిష్ పురస్కారం
ఇండస్ట్రీలో క్రిష్ ఎన్నో వైవిద్యభరిత చిత్రాలు తీశారు. ఆయన తీసిన ‘కంచె’చిత్రానికి నేషనల్ అవార్డు కూడా లభించింది.  ప్రస్తుతం మహానటులు ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా ‘ఎన్టీఆర్’బయోపిక్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
Image result for ntr biopic
ఇక వర్థంతి నాడు గురజాడ పురస్కారాన్ని వివిధ రంగాల్లో ప్రఖ్యాతి గాంచిన ప్రముఖులకు అంజేస్తునమన్నారు. నవంబర్- 30న గురజాడ వర్ధంతిని పురస్కరించుకొని ఈ సంవత్సరం సినీ దర్శకులు జాగర్లమూడి క్రిష్ కు ఈ పురస్కారం ఇవ్వనున్నట్లు సమాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: