దేశ వ్యాప్తంగా ఇప్పుడు శంకర్, సూపర్ స్టార్ రజినీకాంత్ కాంబినేషన్ లో వచ్చిన ‘2.ఒ’చిత్రం పైనే చర్చలు జరుగుతున్నాయి. దాదాపు రెండు సంవత్సరాల క్రితం ప్రారంభం అయిన ఈ చిత్రం మొన్న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కావడం..అన్ని సెంటర్లలో పాజిటీవ్ టాక్ తెచ్చుకోవడం భారీగా కలెక్షన్లు రాబట్టడం జరుగుతుంది. రజనీకాంత్ కెరియర్లోనే అత్యధిక బడ్జెట్ తో '2.ఓ' రూపొందింది .. అత్యధిక థియేటర్లలో విడుదలైంది. అలాంటి ఈ సినిమాను గురించి తాజా ఇంటర్వ్యూలో రజనీకాంత్ మాట్లాడారు. 
2.0 piracy tamilrockers
గతంతో రోబో చిత్రం ఏ రేంజ్ లో సెన్సేషన్ క్రియెట్ చేసిందో అందరికీ తెలిసిందే. సాధారణంగా ఇతర దర్శకుల విషయంలో ఆర్టిస్టులకే పని ఎక్కువగా ఉంటుంది. శంకర్ దగ్గరికి వచ్చేసరికి టెక్నీషియన్స్ కి పని ఎక్కువగా ఉంటుంది.  నటీ,నటుల విషయంలో ఆయన ఎంత శ్రద్ద తీసుకుంటారో..టెక్నీషియన్స్ విషయంలే పది రెట్లు ఎక్కువగా ఆలోచిస్తారు.  శంకర్ సినిమా పూర్తిగా ఆయన ఇమాజినేషన్ పైనే ఆధారపడి నడుస్తుంది. అయినా అప్పుడప్పుడు ఆయన మా ఆలోచనలకి కూడా ప్రాధాన్యతనిస్తుంటాడు.
Image result for 2.0 movie
తనకి ఏం కావాలనేది శంకర్ కి పర్ఫెక్ట్ గా తెలుసు.  ఒక సీన్ విషయంలో ఏంత సమయం అయినా వెచ్చిస్తారు..అది పర్ఫెక్ట్ అనుకున్న తర్వాతే మరో సీన్ లోకి ఎంటర్ అవుతారు.  అంత డెడికేషన్ ఉన్న దర్శకులు శంకర్. టు ఆర్టిస్టులు .. అటు సాంకేతిక నిపుణులు అందరూ కూడా ఆయనపై పూర్తి భరోసా వుంచి పనిచేస్తారు. శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా హాలీవుడ్ స్థాయి సినిమాలకి ఎంతమాత్రం తీసిపోదు" అని చెప్పుకొచ్చారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: