తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు యాంగ్రీ యంగ్ మాన్ గా పేరు తెచ్చుకున్నారు డాక్టర్ రాజశేఖర్.  మొదట విలన్ గా ఎంట్రీ ఇచ్చినా ‘అంకుశం’చిత్రంతో హీరోగా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు.  ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యారు.  తన సహనటి జీవితను వివాహం చేసుకున్న రాజశేఖర్  కొంత కాలం ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చారు.  ఆ మద్య 'గరుడ వేగ'  చిత్రంతో మంచి విజయం అందుకున్నారు. 
Image result for hero rajasekhar garuda vega
మొదటి నుంచి అంచనాలు పెంచుతూ వచ్చిన 'గరుడ వేగ' రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో పాజిటీవ్ టాక్ తెచ్చుకొని మంచి కలెక్షన్లు రాబట్టింది.  ఈ చిత్రంలో కొన్ని యాక్షన్ సీన్స్ లో దుమ్మురేపేశాడని చెప్పుకున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మరో యాక్షన్ చిత్రానికి రెడీ అవుతున్నారు రాజశేఖర్.  కథా నేపథ్యం మాత్రం 1983కి సంబంధించి కొనసాగుతుంది. రాజశేఖర్ ఇంతవరకూ చేసిన చిత్రాలకు ఇది పూర్తి భిన్నంగా ఉండనుంది. హైదరాబాద్ లో వేసిన ప్రత్యేకమైన సెట్లో కీలకమైన యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణను రీసెంట్ గా పూర్తి చేశారు. 
Image result for hero rajasekhar prashanth varma
ఆ మద్య ఈ చిత్రం షూటింగ్ కోసం మనాలి వెళ్లిన రాజశేఖర్ ఫ్యామిలీ ప్రమాదానికి గురైందని వార్తలు వచ్చాయి..అవన్నీ రూమర్లని క్లారిటీ ఇచ్చారు రాజశేఖర్. ప్రస్తుతం డూప్ లేకుండా రాజశేఖర్ పాల్గొన్న ఈ యాక్షన్ ఎపిసోడ్ ఈ చిత్రానికి హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. ఈ చిత్రంలో ఆయనకి మరో హిట్ పడటం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.     


మరింత సమాచారం తెలుసుకోండి: