రామ్ గోపాల్ వర్మ ప్రియ శిష్యుడుగా పేరు గాంచిన పూరి జగన్నాథ్ టాప్ డైరెక్టర్ స్థాయికి చేరుకున్నప్పటికీ తాను ఎప్పటికీ వర్మ శిష్యుడునే అంటూ అనేక సందర్భాలలో ఓపెన్ గానే చెప్పాడు. అంతేకాదు ప్రస్తుతం ముంబాయ్ లో ఉంటున్న వర్మ తాను ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా వర్మ ఇంటిలోనే ఉండటం అతడి అలవాటు.
వర్మ రియాక్షన్
అయితే వర్మ నిర్మించిన ‘భైరవగీత’ ప్రమోషన్స్ కోసం తరుచు హైదరాబాద్ వస్తున్న వర్మ పూరీ ఇంటిలో కాకుండా హైదరాబాద్ లోని ఒక స్టార్ హోటల్ లో ఉంటూ ఉండటంతో వీరిద్దరి మధ్య గ్యాప్ పెరిగిందా అంటూ గాసిప్పులు హాదావిడి చేస్తున్నాయి. అంతేకాదు ‘భైరవగీత’ ప్రమోషన్ కు సంబంధించి జరిగిన ఫంక్షన్స్ లో ఎక్కడా పూరి కనిపించకపోవడం వీరిద్దరి మధ్య పెరుగుతున్న దూరానికి నిదర్శనం అంటూ వార్తలు గుప్పు మంటున్నాయి. 
పవన్ కళ్యాణ్ కోసం
ఇలా వర్మ పూరీల మధ్య దూరం పెరగడానికి పవన్ కళ్యాణ్ కారణం అంటూ వార్తలు వస్తున్నాయి. కొంతకాలం క్రితం శ్రీరెడ్డి క్యాష్టింగ్ కౌచ్ వ్యవహారంలో ఉద్యమం చేస్తున్నప్పుడు ఆమె పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేసినప్పుడు వర్మ శ్రీరెడ్డికి సపోర్ట్ గా నిలవడం పూరీకి ఏమాత్రం నచ్చలేదు అన్న వార్తలు ఉన్నాయి. దీనితో వర్మ పూరీల మధ్య దూరం పెరిగింది అని అంటున్నారు. 
 ఇద్దరి మధ్య చిచ్చు
ఇది చాలదు అన్నట్లుగా ఈమధ్య కాలంలో పూరీ జగన్నాథ్ కెరియర్ ఏమాత్రం ఆశాజనకంగా లేని పరిస్థుతులలో వర్మ వివాదాలకు సపోర్ట్ ఇస్తూ ఓపెన్ గా ఉండటం తనకు మంచిది కాదు అన్న నిర్ణయంతో పూరి వర్మతో ఇలా దూరం కొనసాగిస్తున్నాడు అన్న వార్తలు కూడ ఉన్నాయి. ఏది ఎలా ఉన్నా గురు శిష్యుల అనుబందానికి చాల ఉదాహరణగా నిలిచే వీరిద్దరి మధ్య పెరిగిన దూరం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది..


మరింత సమాచారం తెలుసుకోండి: