సూపర్ స్టార్ రజనీకాంత్ కోసం మూడు ఏళ్ళు కష్టపడి ‘2.0’ ను అత్యంత భారీ గ్రాఫిక్స్ తో 500 కోట్లు ఖర్చు పెట్టి తీసి విమర్శకుల నుండి ప్రశంసలు పొందినా ఆమూవీని 1000 కోట్ల కలక్షన్స్ తీసుకురాగల మూవీగా మార్చలేకపోయాడు శంకర్. అయితే ఈ విషయంలో ఏమాత్రం షాక్ అవ్వకుండా శంకర్ వెంటనే మరో ప్రయాగని శ్రీకారం చుడుతున్నాడు.

తన లేటెస్ట్  ప్రాజెక్టుగా ఇండియన్ ‘భారతీయుడు’ సీక్వెల్ ను స్టార్ట్ చేసాడు శంకర్. కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న ఈమూవీ షూటింగ్ త్వరలో ప్రారంభం కాబోతోంది. ఈసినిమా కూడ అనేక సంచలనాలకు చిరునామాగా ఉంటుందని సమాచారం. కోలీవుడ్ మీడియా రాస్తున్న వార్తల ప్రకారం    ఈసినిమా కోసం ఒక భారీ సెట్  వేస్తున్నట్లు టాక్. అత్యంత భారీ సెట్స్ వేయడం శంకర్ కు సర్వ సాధారణమైన విషయమే అయినా ఈ సెట్ కు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు ఉన్నాయి. 

తెలుస్తున్న సమాచారం మేరకు ఈ సెట్ మొత్తం బంగారు కాంతులతో తళతళలాపోతుందని టాక్.  దీనికోసం ఈసెట్ మెటీరియల్ మొత్తం చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. పక్కా గోల్డ్ సెట్ లా కనిపించడం కోసం ఒక చైనా సంస్థచేత ఈ సెట్ డిజైన్ చేయిస్తున్నట్లు సమాచారం. అయితే కొట్లలో ఖర్చు పెట్టి తయారుచేయిస్తున్న ఈసెట్ లో షూటింగ్ కేవలం రెండురోజులు మాత్రమే  జరుగుతుందని వార్తలు వస్తున్నాయి. 

కోలీవుడ్ మీడియా రాస్తున్న వార్తల ప్రకారం ఈసినిమాలోని కీలక సన్నివేశాలు కొన్ని ఈ సెట్ లో తీస్తారని తెలుస్తోంది. వచ్చే ఏడాది మన దేశంలో పార్ల మెంట్ ఎన్నికలు జరగబోతున్న నేపధ్యంలో  రాజకీయాలకు సంబంధించిన ఘాటైన సెటైర్లు ఈమూవీలో ఉండబోతున్నట్లు సమాచారం. ఈసినిమాను అత్యంత వేగంగా పూర్తిచేసి వచ్చే ఏడాది ఎన్నికలలోపు విడుదలచేసి కమలహాసన్ రాజకీయ భవిష్యత్ కు పనికి వచ్చేలా ఈమూవీ కథను శంకర్ తయారు చేసినట్లు తెలుస్తోంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: